ఆక్సిజన్‌ కోసం 8 యుద్ధ విమానాలు: ఈటెల రాజేందర్‌

23 Apr, 2021 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రయంలో యుద్ధ విమానాలతో ఆక్సిజన్‌ సరాఫరా ప్రక్రియను మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయని తెలిపారు.

భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుందని వెల్లడించారు.. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారన్న మంత్రి.. సత్వరమే ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.

చదవండి: కరోనా: హమ్మయ్య.. నెగెటివ్‌.. అనుకునేలోపే! 


మరిన్ని వార్తలు