నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం

2 Oct, 2022 11:25 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని డీఈఓ కార్యాయలయం వద్ద కూలీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కూలీల అడ్డా వద్ద లోకల్‌ కూలీలు, బీహార్‌ కూలీలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కూలీ డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

చదవండి: (మన మైసూర్‌.. ఇల్లెందు)

మరిన్ని వార్తలు