ఆ గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు

16 Apr, 2021 05:25 IST|Sakshi
వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన మరియపురం వాసులతో సర్పంచ్, వైద్యులు

45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి.. ఆదర్శంగా మరియపురం

గీసుకొండ: వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామం కోవిడ్‌ నియంత్ర ణలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రస్తుతం గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు. ఇక మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా సర్పంచ్‌ అల్లం బాలిరెడ్డి చొరవ తీసుకుని 150 మందిని గీసుకొండ పీహెచ్‌సీకి ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి టీకా వేయించారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తుండటంతో గురువారం నాటికి 164 మందికి టీకా వేయించారు. ఈ ఊరి మొత్తం జనా భా 750కాగా, గ్రామంలో 45 ఏళ్లు పైబడిన మొత్తం 314 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లయింది.   

చదవండి: వ్యాక్సిన్‌ కోసం తరలొస్తున్నారు..

మరిన్ని వార్తలు