Telangana: వర్షం ఎఫెక్ట్‌.. తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్‌

10 Jul, 2022 15:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

ఇది కూడా చదవండి: బయటికి రావొద్దు!.. సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

మరిన్ని వార్తలు