కరోనాతో కొడుకు మృతి, ఆగిన తల్లిదండ్రుల ఊపిరి

10 May, 2021 12:08 IST|Sakshi

కుమారుడి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు మృతి

సాక్షి, మేడ్చల్‌: జవహర్‌నగర్‌ పరిధి వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న హరీష్‌రెడ్డి (31) మరణించగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల గుండె ఆగింది. కుమారుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని హరీష్‌రెడ్డి తల్లి, తండ్రి ఇద్దరూ సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో బంధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన అందరి మనసులను కలిసివేసింది.

చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? 

మరిన్ని వార్తలు