Morning News Today: టుడే మార్నింగ్‌ టాప్‌-10 న్యూస్‌ రౌండప్‌

12 Sep, 2022 10:20 IST|Sakshi


1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే..

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌజ్‌లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్‌ కాకుండా అతని సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం

పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్‌) జారీ చేసింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్‌

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత!

రాణి ఎలిజబెత్‌–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్‌ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్‌ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్‌ ప్యాలెస్‌కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్‌ చార్లెస్‌–3 కుమారులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. యూఎస్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం

యూఎస్‌ ఓపెన్‌లో స్పానిష్‌ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్‌ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. పాక్‌లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం

కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్‌లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని జలాల్‌ ఖాన్‌ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్‌ మందిర్‌ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.చెన్నై-బెంగళూరు రూట్‌లో ఆకాశ ఎయిర్‌ సర్వీసులు

విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్‌లో ఫ్లయిట్‌ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు

‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే!

థ్వాయిట్స్‌ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్‌ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్‌కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్‌) అని మరోపేరు పెట్టారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు