అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం

2 Apr, 2021 11:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో విష వాయువుల లీకేజీ కలకలం రేపింది. మారుతినగర్‌లో విష రసాయనాలు లీకేజీ కావడంతో శుక్రవారం ఉదయం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీ యాసిడ్ నిల్వలు ఉంచింది. ఈ రసాయనాలు నిల్వ చేసిన ట్యాంకర్‌ పగలడంతో విష వాయువులు లీకవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపరి ఆడక ఇబ్బంలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు డెక్కన్‌ కంపెనీని సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు