జనగామలో హై టెన్షన్‌.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

17 Aug, 2022 09:06 IST|Sakshi

సాక్షి, జనగామ: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా జనగామలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు రాళ్లు విసురుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 

ఈ ఘటన వేడి ఇంకా తగ్గలేదు. తాజాగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ప్రచార హోర్డింగ్స్‌ పెట్టాయి.  బండి సంజయ్‌కు సవాల్‌ విసరురూ టీఆర్‌ఎస్‌ నేతలు హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్‌ సిఫారసు నిధులు తేవాలని డిమాండ్‌ చేశారు. కాగా, రెండు పార్టీల ఫ్లెక్సీలతో అక్కడ టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: పాతికేళ్ల లక్ష్యాలు ఘనం మరి.. గత హామీల సంగతి?: కేటీఆర్‌

మరిన్ని వార్తలు