TS Assembly Sessions: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాం.

5 Oct, 2021 10:12 IST|Sakshi

► రాష్ట్రంలో ఉచిత నీరు, విద్యుత్‌ అందిస్తున్నాం. ఫలితంగా రైతులకు ధైర్యం పెరిగింది. తెలంగాణ భూములకు డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌-1 స్థానానికి తీసుకెళ్లాం అన్నారు సీఎం కేసీఆర్‌.
► పోడు భూములపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాల పొడగింపుపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: ఐదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దళిత బంధుపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. బీఏసీ నిర్ణయించిన ప్రకారం నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీకి మూడు రోజుల విరామంతో ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడగించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు