గంటన్నర ముందేహాల్లోకి అనుమతి
కరోనా నేపథ్యంలో అడుగడుగునా శానిటైజేషన్.. పక్కాగా ఏర్పాట్లు
పరీక్ష ప్రారంభ సమయానికి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
4 రోజులు 8 సెషన్లలో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ను నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతి స్తామని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఉదయం పరీక్ష 9 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుందని, ఆ సమయం కంటే నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిం చింది. హాల్టికెట్తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్ను కూడా ఇచ్చామని తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి గుర్తుంచుకోండి..