తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు

14 Sep, 2021 07:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్‌ 15లోగా తమ విభాగాధిపతి/శాఖాధిపతికి దరఖాస్తు చేసుకో వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

ఏపీకి వెళ్లాలనుకుంటున్న అధికారుల విష యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. ఈమేరకు ఏపీకి అంతర్రాష్ట బదిలీలకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఏపీకి పంపేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి నిరభ్యంతర పత్రం జారీచేస్తారు.

చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం

>
మరిన్ని వార్తలు