తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌

15 Jan, 2023 12:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్‌ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో​ మంత్రులు హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. 

మరిన్ని వార్తలు