హైదరాబాద్‌: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు

23 Dec, 2021 08:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శబ్ధ కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, నగర పోలీసు కమిషనర్‌తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   
చదవండి: తెలంగాణ: రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్‌ విడుదల..

మరిన్ని వార్తలు