గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు అనుమతి

11 Jan, 2023 21:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్‌పీఎస్‌స్సీ అప్పీల్స్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

కౌంటర్‌ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెల్లడించవచ్చని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని తెలిపింది.
చదవండి: మోదీ వ్యూహం ఏంటి?.. కేసీఆర్‌ తడాఖా చూపిస్తాడా?

మరిన్ని వార్తలు