రెండు జిల్లాల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు వాయిదా 

26 Oct, 2022 01:14 IST|Sakshi

నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో నవంబర్‌ 9 నుంచి.. మిగతా జిల్లాల్లో యథాతథం 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్‌ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ –1 (ఎస్‌ఏ–1) పరీక్షను నవంబర్‌ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్‌ఏ–1 షెడ్యూల్‌ అమలులో ఉంటుందని వెల్లడించింది.  

మరిన్ని వార్తలు