ముగిసిన గ్రూప్‌–2 దరఖాస్తుల స్వీకరణ

17 Feb, 2023 00:54 IST|Sakshi

5,51,943 దరఖాస్తులు 

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–2 ఉద్యోగాలకు దర­ఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సా యంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కమిషన్‌ వెబ్‌సైట్లో 5.50 లక్షల మంది వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్‌– 2కు సంబంధించిన పరీ క్షల షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు