TS: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు

5 Jan, 2023 04:09 IST|Sakshi
 ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ మెషీన్‌ను పరిశీలిస్తున్న రెడ్కో చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి  

రెడ్కో చైర్మన్‌ వై.సతీశ్‌రెడ్డి వెల్లడి 

గచ్చిబౌలి (హైదరాబాద్‌): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్‌ ఎనర్జీ డెవల‹­³మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ వై.­సతీశ్‌రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ మెషీన్‌ను ఆయన పరిశీలించా­రు. ఈ సందర్భంగా మాట్లా­డు­తూ... హైదరాబాద్‌లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్‌ చేసుకో­వచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే త­క్కువ ధరలతో వాహనాలను చార్జింగ్‌ చేసు­కు­నే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసు­మును నిర్ణ­యించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొద­టిదన్నారు. చార్జింగ్‌ కేంద్రాల్లో పార్కింగ్‌ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు.

మరిన్ని వార్తలు