TSRTC: ఛైర్మన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. ఎండీ సజ్జనార్‌ హర్షం

24 Nov, 2021 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గౌరవంగా ఇచ్చే జీతభత్యాలని తీసుకోనని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు.

చదవండి: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని, ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థికభారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉదారంగా తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ అధికారులు, సూపర్‌వైజర్లు ఉద్యోగులు హర్షం వక్తం చేశారు.

మరిన్ని వార్తలు