నూతన వధూవరులకు టీఎస్ఆ‌ర్టీసీ ఎండీ సజ్జనార్‌ సర్‌ప్రైజ్‌.. స్వయంగా పెళ్లికి వెళ్లి..

12 Nov, 2021 14:23 IST|Sakshi

వివాహానికి బస్సు బుక్‌ చేసుకున్న పెళ్లివారు

దంపతులకు గిఫ్ట్‌ ఇచ్చిన సజ్జనార్‌, ఆర్టీసీ సిబ్బంది

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులతో తమ అనుబంధాన్ని పెంపొందించుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. పెళ్లిళ్లకు బస్సులను కిరాయికి తీసుకునే వధూవరులకు ఆర్టీసీ తరఫున బహుమతులివ్వాలని ఎండీ సజ్జనార్‌ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆకుల భరత్‌, సౌమ్యలు తమ వివాహానికి యాదగిరి గుట్ట నుంచి కొంపల్లి వరకు రెండు బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీంతో వివాహానికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి స్వయంగా బహుమతులు అందజేశారు. 

తాండూరు(రంగారెడ్డి): ఓ పెళ్లిలో ఆర్టీసీ ఉద్యోగులు సర్‌ప్రైజ్‌ చేశారు. దంపతులకు సంస్థ దరపున గిఫ్ట్‌ ఇవ్వడంతో అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఆర్టీసీ సంస్థ పెళ్లిళ్ల కోసం బస్సులు తిప్పుతోంది. ఎలాంటి డిపాజిట్‌ లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాండూరుకు చెందిన ఓ కుటుంబంం పెళ్లి కోసం బస్‌ బుక్‌ చేసుకుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు పెళ్లికి హాజరై దంపతులకు గిఫ్ట్‌ ఇచ్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రజలు సహాకరించాలని ఉద్యోగులు కోరారు.

మరిన్ని వార్తలు