-

సజ్జనార్‌ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..

13 Nov, 2021 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నోటీసులకు ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌లో చిత్రీకరించిన సన్నివేశాలను ఆ సంస్థ శనివారం తొలగించింది. కాగా, ఇటీవల అల్లు అర్జున్‌ నటించిన ర్యాపిడో ప్రకటన వివాదాస్పదమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్‌ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: (అల్లు అర్జున్‌, ర్యాపిడోకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హెచ్చరిక)

మరిన్ని వార్తలు