కరోనాతో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి

4 May, 2021 02:32 IST|Sakshi
సుశీల, కృష్ణ, శ్రీనివాస్‌ (ఫైల్‌)

ఐదు రోజుల క్రితం తల్లి కన్నుమూత

సాక్షి, జనగామ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. గత నెల 27న జన గామకు చెందిన గోనె సుశీల కరోనాతో మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి జనగామలో పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఆమె కుమారుడు గోనెకృష్ణ (58), గంటల్లోనే ఆయన సోదరుడు ఐనవోలు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం పర్యవేక్షకులు శ్రీనివాస్‌ మృతి చెందారు. దీంతో ఒకే కుటుంబంలో కరోనాతో మూడు మరణాలు సంభవించడంతో విషాదం నెలకొంది.  

మరిన్ని వార్తలు