రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి

10 May, 2021 14:05 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్‌ డ్రైనేజీ మరమ్మతులు చేస్తుండగా రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మట్టిలో మృత దేహాలు కూరుకుపోవడంతో జేసీబీ, ఫైర్ ఇంజన్ల  సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రపూర్‌క్‌ చెందిన కిషోర్‌, బాదల్‌గా గుర్తించారు.

చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి 
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..?

 

మరిన్ని వార్తలు