Vemulawada Rajanna Darshanam: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్‌ చర్యలకు ఈవో ఆదేశం

6 Feb, 2022 20:18 IST|Sakshi
భక్తుడి నుంచి డబ్బు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన హోంగార్డు

వేములవాడ:  వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్‌ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్‌ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్‌ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. 
(చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్‌.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే)

మరిన్ని వార్తలు