విజయ పాల ధరలు పెంపు

5 Sep, 2022 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్‌­కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమా­వేశం నిర్వహించి.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ అధికారికంగా అ­లాం­టి సమావేశమేమీ నిర్వహించకుండానే.. గు­ట్టు­చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బ­య­టికి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవరకు.. అంటే సెప్టెంబర్‌ 10, 13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు