వనపర్తి కిడ్నాప్‌, దాడి కేసు: శ్రీకాంత్‌ పరిస్థితి విషమం

21 Aug, 2021 12:20 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: వనపర్తి జిల్లాలో కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి దాడి చేసిన కేసులో బాధితుడి శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతన్ని శనివారం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ​కాగా వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం సంపత్‌ రావుపల్లికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తికి, హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌కు మధ్య డబ్బు విషయంలో గొడవ ఏర్పడగా.. శ్రీకాంత్‌ను అతని కుటుంబ సభ్యులను చంద్రయ్య సంపత్‌రావుపల్లిలో తన ఇంట్లో నిర్భంధించిన విషయం తెలిసిందే.

అంతటితో ఆగకుండా.. కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో  అరుపులు, కేకలు పెట్టారు. ఇవి విన్న చుట్టుపక్కల వారు వెంటనే డయల్‌ 100కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు విముక్తి కల్పించారు. పోలీసుల రాకను గమనించిన చంద్రయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న విపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.
చదవండి: డ‍బ్బు విషయంలో తగాదా.. కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి..

మరిన్ని వార్తలు