వరంగల్: గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

11 Apr, 2022 22:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,వరంగల్: గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా టెస్కోకు సంబంధించిన బట్టలు ఈ గోదాంలో నిల్వ ఉంచుతారు. 

దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు ఉన్నట్లు టేస్కో అధికారులు వెల్లడించారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో గోదాము గోడలు కూలాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలయాల్సి ఉంది. ఎవరైనా నిప్పు వేశారా.. లేక కరెంటు షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు