ప్రేమ పెళ్లి.. అన్నీ అవసరాలు తీర్చుకుని..

2 Jun, 2022 21:36 IST|Sakshi
దీక్ష చేస్తున్న జ్యోతి

సాక్షి,కురవి(ములుగు): ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. మాయ మాటలు చెప్పాడు.. తీరా అన్ని అసరాలు తీరాక వదిలేయడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు నిరసన దీక్ష చేస్తున్న ఘటన మండలంలోని నేరడ శివారు కాకులబోడు తండా గ్రామంలో బుధవారం  జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు బానోత్‌ వీరన్న, సుక్మమ్మ కథనం ప్రకారం.. మండలంలోని నేరడ శివారు కాకులబోడు తండ జీపీ సర్పంచ్‌ గుగులోత్‌ కిషన్‌ కుమారుడు విజయ్, అదే తండాకు చెందిన బానోత్‌ వీరన్న, సుక్కమ్మ కుమార్తె జ్యోతి ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అయితే అమ్మాయికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. గత నెల 6వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి నాలుగు, ఐదు గంటల ముందు జ్యోతిని విజయ్‌ తీసుకెళ్లాడు. వేరే గ్రామంలోని ఓ గుడిలో జ్యోతి మెడలో తాళి కట్టాడు.  ఇన్ని రోజులు  పలు ప్రాంతాల్లో తిరిగారు. గత మంగళవారం(31వ తేదీ) విజయ్, జ్యోతి ఇద్దరు తండాకు వచ్చారు. జ్యోతిని తన ఇంటికి తీసుకెళ్లకుండా  తన తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపం చెందిన జ్యోతి బుధవారం భర్త(ప్రియుడి) ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు నిరసన దీక్ష చేపడుతానని భీష్మించుకుని కూర్చుంది. నిరసన దీక్ష చేపడుతున్న సమయంలోనే ప్రియుడు(విజయ్‌) అతడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. కాగా తన బిడ్డకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వీరన్న, సుక్మమ్మలు వేడుకుంటున్నారు.

చదవండి: నాడు హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదు: రఘునందన్‌రావు

మరిన్ని వార్తలు