బ్యాడిగి రకం అ‘ధర’హో..!

6 Jan, 2021 15:13 IST|Sakshi

బ్యాడిగి రకం మిర్చి క్వింటాకు రూ. 24 వేలు

వరంగల్‌: జిల్లా‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి రాక ప్రారంభమైంది. కొత్తగా ‘బ్యాడిగి’ రకం మిర్చి క్వింటాకు రూ.24 వేల రికార్డు ధర పలి కింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మల్లనపల్లికి చెందిన రైతు మొదటి కోత 3 బస్తాల మిర్చిని తీసుకురాగా.. కరాణీ స్పైసెస్‌ బాధ్యులు ఖరీదు చేశారు. ఈ మిర్చి నుంచి తీసే నూనెను రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాడిగి రకం వరంగల్‌ మార్కెట్‌కు రావడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు