వరంగల్ : గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు అదివారం మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి 29వ డివిజన్ కార్పొరేటర్గా నామినేషన్ అందజేశారు. అలాగే, దివంగత మంత్రి దాస్యం ప్రణయ్భాస్కర్ కుమారుడు అభినవ్భాస్కర్ 60 డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు.
ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోదరి నల్లా స్వరూపరాణి 57వ డివిజన్ నుంచి, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ 10వ డివిజన్ నుంచి, మాజీ స్టాండింగ్ కమిటి చైర్మన్ గుండేటి నరేందర్ 20వ డివిజన్ నుంచి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి 34వ డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బంక సరళాయాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కేడల పద్మ, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ
ఒకరు కాకపోతే ఇంకొకరు...
నగరంలోని పలు డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరేసి కార్పొరేటర్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
టీఆర్ఎస్ నాయకుడు యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి, బీజేపీ నాయకులు, సోదరులైన చాచర్ల చిన్నారావు 41 డివిజన్, దీనదయాళ్ 40వ డివిజన్ నుంచి, 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి, అదే డివిజన్ నుంచి ఆరేళ్లి రవితో పాటు ఆయన సతీమణి కూడా నామినేషన్లను దాఖలు చేశారు. స్రూ్కటినీలో ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైనా మరొకరు పోటీలో ఉండొచ్చనే భావనతో ఇద్దరేసి నామినేషన్లు సమర్పించినట్లు తెలిపారు.
నేడు నామినేషన్ల పరిశీలన
వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో భాగంగా అదివారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ము గిసింది. ఇక సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేష న్లు స్వీకరించిన వరంగల్లోని ఎల్బీ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో పరిశీలనకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమర్పించిన అభ్యర్థుల్లోఉత్కంఠ నెలకొంది.
పరిశీలన విధివిధానాలు