Yadadri Temple: యాదాద్రి టెంపుల్‌ క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది హల్‌చల్‌

23 Jul, 2022 16:23 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఓ అడవి పంది హల్‌చల్‌ చేసింది. యాద్రాది క్యూ కాంప్లెక్స్‌లోకి దూరి పరుగులు తీసింది. ఈ క్రమంలోనే క్యూ కాంప్లెక్స్‌ భవనంపై నుంచి పడిపోయి పంది చనిపోయింది. అనంతరం, అడవి పంది కళేబరాన్ని ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది తొలగించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోకి పంది రావడంతో అర్చకులు ఆలయంలో పుణ్యవచనం చేపట్టనున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం

మరిన్ని వార్తలు