రేసు కుక్క.. పెరిగిన లెక్క 

12 Apr, 2022 04:53 IST|Sakshi

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లాలోని అటవీప్రాంతంలో వైల్డ్‌డాగ్స్‌ (రేసు కుక్కలు) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పదులలో ఉన్న రేసుకుక్కల సంఖ్య ఈ రెండేళ్లలో రెండు వందలకుపైగా పెరిగింది. ఈ మేరకు రామాయంపేట, నర్సాపూర్, పోచారం అభయారణ్యం పరిధిలో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

రేసుకుక్కలు గుంపులుగా సంచరిస్తాయని, ఒక్కో గుంపులో కనీసం ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉంటాయని అధికారులు అంటున్నారు. వీటి దాడి భయానకంగా, వేటాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని, వీటి బారిన పడిన ఏ జంతువైనా బతకడం అసాధ్యమని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు