కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలలే గడువు ఇస్తున్నట్టు గెజిట్లో కేంద్రం వెల్లడి
పనులు పూర్తయినా నీళ్లు తీసుకునే వీల్లేదని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది.
గెజిట్లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే
కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు
(వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది)
కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు
(ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది)
ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు
మున్నేరు పునర్ నిర్మాణం
గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు