HYD: బీజేపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

6 Jul, 2022 17:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. నేడు(బుధవారం) ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 50 పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధరల పెంపుపై కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి మహిళా కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా బీజేపీ మైనార్టీ మోర్చా ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తతకర వాతావరణం చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో వైరస్‌ కలకలం.. హెచ్చరించిన వైద్యులు

మరిన్ని వార్తలు