Yadadri Crime: విడిపోయి బతకడం ఇష్టం లేక.. కలిసి కన్నుమూశారు!

9 Nov, 2022 12:39 IST|Sakshi

సాక్షి, యాదాద్రి జిల్లా:  జిల్లాలో ఓ ప్రేమ జంట బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. బహూపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ జంట. మృతుల్ని బస్వాపూర్‌కి చెందిన గణేష్‌, నలందగా గుర్తించారు పోలీసులు. 

నలందకి వివాహం జరిగింది. అయితే.. గణేష్‌తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం!.

మరిన్ని వార్తలు