విషాదం: ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే..

23 May, 2021 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాచారంలో విషాదం చోటు చేసుకుంది. ఐస్‌క్రీమ్‌ తిన్న కొద్దిసేపటికే సంపత్‌ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీ ద్వారా కేజీ ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసిన సంపత్‌.. తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో మరణించాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చదవండి: వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!
Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

>
మరిన్ని వార్తలు