HYD: హెచ్‌ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్‌

2 Jul, 2022 12:49 IST|Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ హెచ్‌ఐసీసీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు హెచ్‌ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వచ్చే సమయంలో ఆయనను అడ్డుకోవాలని కాంగ్రెస్‌ నేతలు భావించినట్టు సమాచారం. దీంతో, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం

మరిన్ని వార్తలు