జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వైఎస్సార్‌ సీపీ దూరం

19 Nov, 2020 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయటం లేదని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా,  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్‌ఎస్‌ గురువారం విడుదల చేసింది. 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 125 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది.

చదవండి : గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే..

మరిన్ని వార్తలు