ఐదో రోజు ముగిసిన వైఎస్‌ షర్మిల పాదయాత్ర

24 Oct, 2021 21:18 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర ఐదో రోజు ముగిసింది. ఐదోరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేశారు. కొత్తతండా, డబీల్ గూడ, మన్సాన్ పల్లి, కొత్వాల్ తండా మహేశ్వరం వరకు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు చేవెళ్ల నుంచి మహేశ్వరం వరకు 60 కిలో మీటర్లు పాదయాత్ర సాగింది.

మహేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్ ఫాం హౌస్ కోసమే కాళేశ్వరం నీళ్లు అంటూ విమర్శలు గుప్పించారు. విద్యా శాఖమంత్రి ఇలాకాలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు