స్పెయిన్‌లో సెలబ్రేషన్‌

10 Feb, 2023 00:34 IST|Sakshi

ఫారిన్‌ టూర్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ‘అతడు’,  ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు,  దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ముగిసింది. ముఖ్యంగా హాస్పిటల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్‌ త్వరలో ఆరంభం కానుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి మహేశ్‌ స్పెయిన్‌ వెళ్లారని సమాచారం. ఫిబ్రవరి 10 (శుక్రవారం) మహేశ్, నమ్రతల పెళ్లి రోజు. మ్యారేజ్‌ డే సెలబ్రేషన్స్‌ కోసమే స్పెయిన్‌కు వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. 

మరిన్ని వార్తలు