డాబాగార్డెన్స్: ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్–2లో నగరానికి చెందిన సౌజన్య భాగవతుల అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ సీజనల్లో విజేతగా నిలవాలంటే ప్రజల అండదండలు అవసరమని ఆమె అభ్యర్థించారు. శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ అందుబాటులో ఉంటుందని, నగర ప్రజలందరూ తనకు ఓటు వేయాలన్నారు.
ఈ సందర్భంగా విశాఖ సంగీత కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ సౌజన్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన గానంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలతో పాటు సంగీత ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు.