భార్యపై అనుమానంతో దాడి

27 May, 2023 12:08 IST|Sakshi
అమీనాబేగంను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

సాక్షి, భీమవరం : భార్యపై అనుమానంతో కత్తెరతో హత్యాయత్నం చేసిన భర్త ఉదంతమిది. భీమవరం వన్‌టౌన్‌ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమ వరం పట్టణానికి చెందిన షేక్‌ నాగూర్‌సాహెబ్‌కు పట్టణంలోని మెంటేవారితోటకు చెందిన షేక్‌ లాలాసాహెబ్‌ కుమారై అమీనాబేగంతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా నాగూర్‌సాహెబ్‌ భార్య ను అనుమానించడం, చిత్రహింసలు చేస్తుండడంతో ఆరు నెలల కిత్రం పుట్టింటికి వెళ్లిపోయింది.

ఐతే శుక్రవారం పట్టణంలోని రంగాబజార్‌ ప్రాంతంలోని టైలరింగ్‌ షాపులో పనిచేస్తున్న అమీనాబేగం వద్దకు వచ్చిన నాగూర్‌సాహెబ్‌ ఆమెతో గొడవపడి కత్తెరతో గాయపర్చాడు. బాధితురాలిని చికిత్సకోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లాలాసాహెబ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు