గరిడేపల్లి : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. గరిడేపల్లి ఎస్ఐ కొండల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గరిడేపల్లి మండలం ఎల్బీనగర్కు చెందిన దొంతిరెడ్డి నరేందర్రెడ్డి తండ్రి ఆరోగ్య రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం ఎల్బీనగర్లోని ఇంటి వద్దకు రాగా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి బీరువా పగులగొట్టి ఉంది. బీరువాలో గల ఆభరణాలు కనిపించలేదు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి క్లూజ్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.