టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఓపెన‌ర్లుగా రోహిత్, జైశ్వాల్‌.. గిల్‌కు నో ఛాన్స్‌? | Sakshi
Sakshi News home page

T20 WC 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఓపెన‌ర్లుగా రోహిత్, జైశ్వాల్‌.. గిల్‌కు నో ఛాన్స్‌?

Published Tue, Apr 23 2024 5:21 PM

Irfan Pathan Picks Indias Top 3 For T20 WC 2024 - Sakshi

ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మ‌రో మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. జూన్‌1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా టీ20 వరల్డ్ కప్-2024 షురూ కానుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి నెల రోజుల పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి.. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మే 1లోపు ఆయా జ‌ట్లు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సిందే.

ఈ క్ర‌మంలో ఆయా దేశ క్రికెట్ బోర్డులు త‌మ జ‌ట్ల‌ను ఖారారు చేసే ప‌నిలో ప‌డ్డాయి. బీసీసీఐ కూడా త‌మ జ‌ట్టును ఏప్రిల్ 28న ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌లిసి వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భామ‌య్యే జ‌ట్టును వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్‌ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగ‌మ‌య్యే భార‌త టాప్‌-3 ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నాడు.  భార‌త ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, యువ ఆట‌గాడు య‌శ‌స్వీ జైశ్వాల్‌ను క‌లిసి ప్రారంభించాల‌ని ప‌ఠాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జైశ్వాల్ ముంబై ఇండియ‌న్స్‌పై అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడ‌ని, కాబ‌ట్టి అత‌డు క‌చ్చితంగా ఓపెన‌ర్‌గా రావాల‌ని ప‌ఠాన్ అన్నాడు.

అదే విధంగా ఫ‌స్ట్ డౌన్‌లో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లిని  ప‌ఠాన్ ఎంపిక చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో కోహ్లి క‌చ్చితంగా ఉంటాడ‌ని ఇర్ఫాన్ థీమా వ్య‌క్తం చేశాడు. స్ట్రైక్ రేట్ ప‌రంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడ‌ని, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి మెగా ఈవెంట్‌లో స్ట్రైక్ రేట్ పెద్ద స‌మ‌స్య కాద‌ని ప‌ఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

Advertisement
Advertisement