Top Stories
ప్రధాన వార్తలు
ఈసీ అంఫైర్లా వ్యవహరించలేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఏ ఒక్కరినీ వదల్లేదు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వాంగ్మూలం
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం.. సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం, పాలక పక్షం అని చూడకుండా.. నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసిన ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు.. ప్రణీత్రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది.భుజంగరావు వాంగ్మూలంలోని విషయాలు యథాతథంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లాం. ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. .. జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్తో ఆపరేషన్ చేశాం. అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. .. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం. .. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది.ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు.
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates.. 2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024
'పుష్ప' విలన్కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
డయాబెటిక్ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం
ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్పట్టి పూదూర్లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్లెట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
హైదరాబాద్, సాక్షి: రియల్టర్ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్.. ఎక్కడో బీదర్లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్ ఎస్టేట్తో పాటు ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా గ్యాంగ్తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్ను నెలరోజులు హైదరాబాద్లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్ కోసం తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కొంచెం బాధపడ్డాను.. కానీ రోహిత్ భయ్యా మాత్రం చాలా: రింకూ
టీ20 వరల్డ్కప్-2024కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే.రింకూకు మెయిన్ స్వ్కాడ్లో కాకుండా రిజర్వ్ జాబితాలో సెలక్టర్లు చోటిచ్చారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో వరల్డ్కప్ జట్టులో చోటుదక్కకపోవడంపై తొలిసారి రింకూ స్పందించాడు. జట్టు సెలక్షన్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడాని, ఎంతో సపోర్ట్గా నిలిచాడని రింకూ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడం నాకు కొంచెం బాధ కల్గించంది. ఎందుకంటే మనం బాగా ఆడుతున్నప్పటకి ఎంపిక కాకపోతే సహజంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయకపోవడంలో సెలక్టర్లు తప్పేమి లేదు. టీమ్ కాంబినేషన్ కారణంగా నన్ను ఎంపిక చేయలేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ తర్వాత మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా సరే అది మన మంచికే అనుకున్నాను. రోహిత్ భయ్యా కూడా నాతో మాట్లాడు. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని రోహిత్ చెప్పాడు. కష్టపడి పనిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు సపోర్ట్గా నిలిచాడని" దైనిక్ జాగరణ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు.
తప్పక చదవండి
- ప్రజా భవన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
- అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో
- మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్మెంట్ రూ.లక్ష!
- ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం.. ప్రధాని మోదీ ట్వీట్
- తెలివితక్కువదానిలా ఉన్నావంటూ ఆ హీరో తిట్టాడు: సీనియర్ హీరోయిన్
- వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
సినిమా
హీరోయిన్ మడోన్నా కూడా మారిపోయింది!
సినిమాకు గ్లామర్ ముఖ్యమే. కానీ ఇప్పుడు హీరోయిన్లకు కూడా గ్లామరే ప్రధానంగా మారిపోతోంది. ఇంతకు ముందు పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న చాలామంది బ్యూటీస్.. ఇప్పుడు గ్లామర్ పాత్రలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు మడోన్నా సెబాస్టియన్ కూడా చేరినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)పలుమార్లు స్టేజీపై పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న మడోన్నా.. 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేసింది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. గతేడాది వచ్చిన విజయ్ 'లియో'లో అతడికి చెల్లెలిగా చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.అయితే ఇప్పటివరకూ గ్లామర్కి దూరంగా ఉంటూ వచ్చిన మడోన్నా.. ఇప్పుడు మాత్రం రూట్ మార్చేసినట్లు అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా గ్లామర్ చూపిస్తూ రెచ్చిపోతోంది. అయితే దర్శకనిర్మాతలకు తాను కూడా గ్లామర్ బ్యూటీనే అనే హింట్ ఇస్తోందా అని సందేహం వస్తుంది. ఇలా అయినా సరే ఈమెకు కమర్షియల్ మూవీస్లో ఛాన్సులొస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial)
ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. విజయ్తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)#AnandDeverakonda: who's your fav co-star#Rashmika: Neeyabba.. Nuvvu Naa family anand #GamGamGanesha Pre Release pic.twitter.com/ZhiSfUU6pF— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 27, 2024
హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. రీసెంట్ టైంలోనే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఇప్పుడు స్వయంగా ఆమెనే స్పందించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)గుజరాత్కు చెందిన నమిత.. 'సొంతం' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ సెటిలైపోయింది. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న నమిత.. తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నమిత స్పందించాల్సి వచ్చింది.'ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను. ఇప్పుడొచ్చిన దానితో నేను-నా భర్త ఏం బాధపడట్లేదు. ఫుల్లుగా నవ్వుకున్నాం' అని నమిత చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
సర్ప్రైజ్ చూపించేద్దామా..!
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి.ఈ బుజ్జికి కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేషన్ ప్రెల్యూడ్ వీడియోను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, టీజర్ను విడుదల చేశారు. ‘‘ఓకే బుజ్జి.. వీళ్లకి సర్ప్రైజ్ చూపించేద్దామా?’ (ప్రభాస్), ‘ఓకే భైరవ..’ (వాయిస్ ఓవర్తో బుజ్జి) వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని వివిధ పాత్రల పరిచయంతో ఈ వీడియో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్
ఫొటోలు
క్రీడలు
కొంచెం బాధపడ్డాను.. కానీ రోహిత్ భయ్యా మాత్రం చాలా: రింకూ
టీ20 వరల్డ్కప్-2024కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే.రింకూకు మెయిన్ స్వ్కాడ్లో కాకుండా రిజర్వ్ జాబితాలో సెలక్టర్లు చోటిచ్చారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో వరల్డ్కప్ జట్టులో చోటుదక్కకపోవడంపై తొలిసారి రింకూ స్పందించాడు. జట్టు సెలక్షన్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడాని, ఎంతో సపోర్ట్గా నిలిచాడని రింకూ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడం నాకు కొంచెం బాధ కల్గించంది. ఎందుకంటే మనం బాగా ఆడుతున్నప్పటకి ఎంపిక కాకపోతే సహజంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయకపోవడంలో సెలక్టర్లు తప్పేమి లేదు. టీమ్ కాంబినేషన్ కారణంగా నన్ను ఎంపిక చేయలేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ తర్వాత మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా సరే అది మన మంచికే అనుకున్నాను. రోహిత్ భయ్యా కూడా నాతో మాట్లాడు. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని రోహిత్ చెప్పాడు. కష్టపడి పనిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు సపోర్ట్గా నిలిచాడని" దైనిక్ జాగరణ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు.
పుట్టుకతోనే దృష్టి లోపం.. అయినా గానీ వరల్డ్ ఛాంపియన్!
జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహిళల 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కేవలం 24.95 సెకన్లలోనే పరుగు పూర్తి చేసిన సిమ్రాన్.. భారత్కు ఆరో గోల్డ్మెడల్ను అందించింది. పారిస్ ఒలింపిక్స్కు ముందు బంగారు పతకం సాధించడం సిమ్రాన్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.ఇక ఛాంపియన్గా నిలిచిన సిమ్రాన్ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సిమ్రాన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఢిల్లీకి చెందిన సిమ్రాన్ కథ ఎంతో మందికి ఆదర్శం. ఈ నేపథ్యంలో అథ్లెట్గా సిమ్రాన్ జర్నీపై ఓ లుక్కేద్దాం.ఎన్నో కష్టాలు..సిమ్రాన్ పూర్తిగా నెలల నిండకుండానే(ప్రీ మ్యాచూర్ బేబీ) జన్మించింది. కేవలం ఆరున్నర నెలలకే ఈ ప్రపంచంలోకి సిమ్రాన్ అడుగుపెట్టింది. ఆమె పుట్టినప్పటి నుంచే దృష్టి లోపంతో బాధపడుతోంది.పుట్టిన తర్వాత ఆమె దాదాపు నెలలకు పైగా ఇంక్యుబేటర్లో గడిపింది. దృష్టి లోపం వల్ల ఆమెను ఇరుగుపొరుగు వారు హేళన చేసేవారు. కానీ వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించి హేళన చేసిన వారితోనే శెభాష్ అనుపించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు తన కలలు కన్నట్లు గానే వరల్డ్ ఛాంపియన్గా నిలిచి అందరితోనూ శెభాష్ అనిపించుకుంది.సూపర్ లవ్ స్టోరీ.. భర్తే కోచ్ఇక సిమ్రాన్ వరల్డ్ ఛాంపియన్గా నిలవడంలో తన భర్త గజేంద్ర సింగ్ది కీలక పాత్ర. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ సినిమా స్టోరీని తలపిస్తోంది. గజేంద్ర సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే లక్నోలో సమీపంలోని ఖంజర్పూర్ గ్రామానికి చెందిన సింగ్.. తన కూడా అంతర్జాతీయ స్ధాయిలో అథ్లెట్గా రాణించాలని కలలు కన్నాడు. కానీ గజేంద్ర సింగ్ తన కలను నేరవేర్చుకోలేకపోయాడు.ఆర్ధికంగా స్థోమత లేని వారికి శిక్షణ ఇచ్చి వారి విజయాల్లో భాగం కావాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2015లో ఢిల్లీలోని ఎమ్ఎమ్ కాలేజీ గ్రౌండ్లో సిమ్రాన్తో సింగ్కు తొలిపరిచయం ఏర్పడింది. సిమ్రాన్కు గజేంద్ర సింగ్ కోచ్గా పనిచేశాడు. ఇద్దరూకాగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను గజేంద్ర సింగ్ కుటంబం అంగీకరించలేదు. కానీ గజేంద్ర సింగ్ తన ఫ్యామిలీని ఎదురించి 2017లో సిమ్రాన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కుటంబాలకు దూరంగా ఉంటున్నారు.అతడితో సూచనతోనే..ఇక తన భార్యను ప్రపంచ స్ధాయి అథ్లెట్గా చూడాలని కలలు గన్న గజేంద్ర సింగ్.. వివాహం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పారా అథ్లెట్ నారాయణ్ ఠాకూర్తో గజేంద్ర సింగ్, సిమ్రాన్ సమావేశమయ్యారు. మహిళల పారా విభాగంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే 2019లో మహిళల T13 కేటగిరీకి సంబంధించిన లైసెన్స్ని పొందేందుకు శర్మ వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్లో పోటీ పడింది. అయితే లైసెన్స్ పొందేందుకు వారికి పెద్ద మొత్తాన డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిమ్రాన్ భర్త సింగ్ లోన్ తీసుకోవడంతో పాటు తన పేరిట ఉన్న స్ధలాన్ని విక్రయించాడు. ఆ తర్వాత దుబాయ్లో జరిగే ప్రపంచ పారా ఛాంపియన్షిప్కు అర్హత సాధించడానికి ముందు చైనాలో జరిగిన క్వాలిఫయర్స్లో ఆమె స్వర్ణం గెలుచుకుంది. కానీ దుబాయ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ 100 మీటర్ల T13 ఫైనల్లో ఆమె ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత షిమ్రాన్ తన కెరీర్లో ఉన్నో ఎత్తు పల్లాలను చవిచూస్తూ వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది.
ఉజ్బెకిస్తాన్తో.. ఫుట్బాల్ మ్యాచ్లకు సౌమ్య!
తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ భారత మహిళల ఫుట్బాల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్ నగరంలో ఉజ్బెకిస్తాన్ జట్టుతో మే 31, జూన్ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.30 మంది ప్రాబబుల్స్కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్లోని శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్ కప్ టోరీ్నలో రన్నరప్గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.ఇవి చదవండి: నాలుగో ర్యాంక్లో జ్యోతి సురేఖ..
నాలుగో ర్యాంక్లో జ్యోతి సురేఖ..
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలిచింది.గత ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్లో ఉన్న జ్యోతి సురేఖ కొరియాలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–2 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆమె ర్యాంక్లో మార్పు వచ్చింది. భారత్కే చెందిన అదితి 10వ ర్యాంక్లో, పరీ్ణత్ కౌర్ 12వ ర్యాంక్లో కొనసాగుతున్నారు. టీమ్ విభాగంలో సురేఖ, అదితి, పరీ్ణత్ బృందం నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంది.
బిజినెస్
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్ఫీల్డ్లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ను కలిగి ఉంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’గూగుల్ తన ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్కాన్ ఫెసిలిటీలో స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం
ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్పట్టి పూదూర్లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్లెట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్ఫరేఖ్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం. ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ఏఐ విభాగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పటివరకు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్ను అందుకున్నారు. అయితే, బోనస్ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది. కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 22,973కు చేరింది. సెన్సెక్స్ 123 పాయింట్లు దిగజారి 75,503 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.54 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.7 శాతం, నాస్డాక్ 1.10 శాతం లాభపడ్డాయి.దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
విభజనకు పదేళు ఏపీకి ఎవరేం చేశారు ?
ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్
హైకోర్టులో పిన్నేల్లికి భారీ ఊరట..
పసుపు పూసుకున్న పోలీసులు
బాబు పై భక్తి చాటుకున్న పోలీసులు
అమ్మకానికి చిన్నారులు బయటపడ్డ సంచలన నిజాలు
కాంగ్రస్ బలపడిందా ఎగ్జిట్ పోల్స్..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 28 May 2024
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
ఫ్యామిలీ
డయాబెటిక్ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు.
Cannes 2024: పింకీ గౌన్లో అదితిరావు ప్రెటీ లుక్స్ (ఫోటోలు)
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?)
సోరియాసిస్ 'అంటు వ్యాధా'? ముద్దు పెట్టుకుంటే..?
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ ( Psoriasis) దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్లో ప్రధానంగా తెల్లటి పొలుసులు , లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు వస్తాయి. మంట, విపరీతైన దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ప్రధానంగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. చేతులు లేదా కాళ్ళపై సోరియాసిస్ రోజువారీ కార్యకలాపాలు కష్టంగా ఉంటుంది. అలాగే గజ్జ లేదా పిరుదుల వంటి ప్రాంతాలలో సోరియాసిస్ వస్తే కూర్చోవడం లేదా టాయిలెట్కు వెళ్లడం కూడా బాధాకరంగా ఉంటుంది.సోరియాసిస్ భౌతిక అంశాలను పక్కన పెడితే దీనిపై అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం సోరియాసిస్ సోకినవారి దూరంపెట్టడం, అది అంటు వ్యాధి ఏమో అని భయపడటం లాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సోరియాసిస్ చుట్టూ ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాంసోరియాసిస్ అంటువ్యాధి: కాదు ఇది అంటువ్యాధి కాదు. ప్రాణాంతకం అంతకన్నా కాదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. వ్యక్తి-నుండి-వ్యక్తికివ్యాపించదు. పరిచయం లేదా శారీరక స్రావాల ద్వారా వ్యాపించదు. ఉదాహరణకు, ముద్దు పెట్టుకున్నా, ఆహారం లేదా పానీయాలను పంచుకున్నా, ఈత కొలనులు లేదా ఆవిరి స్నానాలలో లాంటి సన్నిహిత బహిరంగ ప్రదేశాలలో ఇది ఇతరులకు సోకదు. సోరియాసిస్ కేవలం పొడి చర్మంవారికే వస్తుంది. కానే కాదు. చర్మ నిర్మాణం చాలా వేగంగా మారుతుంది - సాధారణ స్కిన్ టర్నోవర్ ప్రతి 28 రోజులు అయితే, సోరియాసిస్లో 4-5 రోజులలోపే ఉంటుంది. రక్తనాళాలు కూడా మారుతాయి అందుకే గోకిన ప్రాంతాలు ఎర్రగా మారతాయి. మరింత తీవ్రమైన సందర్భాల్లో, సోరియాసిస్ చర్మం పగుళ్లు ,రక్తస్రావం అవుతుంది.సోరియాసిస్లో చాలా రకాలుసోరియాసిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయని భావిస్తారు. కానీ గట్టెట్ సోరియాసిస్, ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్, పస్ట్యులర్ సోరియాసిస్, ప్లాంటార్ సొరియాసిస్, ఇన్వర్స్ సొరియాసిస్, ఫేస్ సొరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ లాంటి పలు రకాలు ఉన్నాయి. లక్షణాలు బట్టి ఏ రకం సోరియాస్ అనేది నిర్ధారిస్తారు.పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది పూర్తి అపోహ మాత్రమే. అయితే సోరియాసిస్తో బాధపడుతున్న వ్యక్తులు స్వీయ-సంరక్షణ గురించి జాగ్రత్తపడాలి. నిరంతరం సంరక్షణ అవసరం.సోరియాసిస్ను నయం చేయవచ్చుఇది మరొక అపోహ. ప్రస్తుతానికి సోరియాసిస్కు నివారణ సాధ్యం కాదు కానీ నిర్వహణ, ఉపశమన చికిత్స ఉంది. వ్యక్తి ఎంత తీవ్రంగా ప్రభావితమయ్యాడనే దానిపై ఆధారపడి, సోరియాసిస్ లక్షణాల నుండి ఉపశమన మార్గాలున్నాయి.సోరియాసిస్ చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? కానేకాదు ఒక్కోసారి చర్మం కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్తో బాధపడుతున్న వ్యక్తులలో 6–42శాతం సోరియాటిక్ ఆర్థరైటిస్కు దారి తీయవచ్చు.చికిత్స లేనప్పటికీ, చికిత్స ఎంపికలు లేవు అనేది మరో అపోహ. సోరియాసిస్ అనేది జీవితకాలం పాటు ఉండే దీర్ఘకాలిక పరిస్థితి. క్రీములు, లేపనాలు , జెల్స్, సమయోచిత (చర్మానికి వర్తించే), లైట్ థెరపీ లాంటి చికిత్సల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది వైద్యునిమార్గదర్శకత్వంలో తీసుకోవాలి. దీనిపై శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో నివారణ చికిత్స మార్గాలు వెలుగులోకి వస్తాయిని ఆశిద్దాం. ఏం చేయాలి?సోరియాసిస్ ఎగ్జిమా లాంటిదే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా యుక్తవసులో ప్రారంభమై జీవిత కాలం ఉంటుంది. పిల్లలు, శిశువుల్లో ఇది చాలా అరుదు. అలాగే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల సోరియాసిస్ను నయం చేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతారు.ఊబకాయం, ఆల్కహాల్, ధూమపానం వంటి కారకాలు సోరియాసిస్ లక్షణాల తీవ్రతను పెంచుతాయి. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం, బరువు నియంత్రణలో ఉండేలా చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం విధిగా పాటించాలి.
న్యూస్ పాడ్కాస్ట్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
పోకిరీకి చెప్పుతో దేహశుద్ధి
యశవంతపుర: ఐ లవ్ యూ అని మహిళకు పదే పదే మెసేజ్లు పంపి వేధిస్తున్న పోకిరీని ఆమె పాదరక్షతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన బాగలకోట జిల్లా ఇళకల్ పట్టణంలో జరిగింది. యాసిన్ అనే యువకుడు నివేదిత అనే మహిళను ప్రేమించాలని వాట్సాప్లో సందేశాలు పంపసాగాడు. ఇద్దరూ పెళ్లయి కుటుంబాలు ఉన్నవారే. కానీ యాసిన్ బుద్ధి పెడదారి పట్టింది. తనను ప్రేమించాలని ఆమెను వెంటపడసాగాడు. దీంతో ఆదివారం ఆక్రోశానికి గురైన మహిళ యాసిన్ ఇంటికి వచ్చి అతన్ని చెప్పుతో చితకబాదింది. తప్పయిపోయిందని పోకిరీ దండాలు పెట్టాడు. స్థానికులు ఆమెకు సర్దిచెప్పి పంపారు.
వెబ్సైట్లో ఫొటోలు పెట్టి...
గచ్చిబౌలి: పోర్న్ వెబ్సైట్లో ఫొటోలు పెట్టడం, వాట్సప్లో అసభ్య మెసేజ్లు పంపి ఐటీ ఉద్యోగిని వేధిస్తున్న ఓ నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ తెలిపారు. ఈస్ట్ ముంబై, గారెగాన్, జయజయప్రకాష్ నగర్కు చెందిన అభిõÙక్ మోహన్ కీర్తికర్ (42) ముంబైలో ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీలో పని చేసే ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. ఆ ఉద్యోగినితో పరిచయం పెరగడంతో ప్రేమించాలని ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమెను రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. వివిధ ఫోన్ నెంబర్ల ద్వార వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపడం, పోర్న్ వెబ్సైట్లలో ఆ ఉద్యోగిని ఫొటోలు, ఫోన్ నెంబర్లు పెట్టి వేధిస్తున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ఫోన్లో మాట్లాడడంతో తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో బాధితురాలు ఫిబ్రవరిలో గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అభిõÙక్ మోహన్ కీర్తికర్ ను ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. సోమవారం కూకట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇతను చాలా మంది యువతులకు మాయమాటలు చెప్పి దగ్గర కావడం, చెప్పినట్లు వినకపోతే అసభ్య మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
బన్సీలాల్పేట్: అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు బైక్పై వెళ్తున్న బావబామ్మర్దులను మృత్యురూపంలో వచ్చిన మినీ బస్సు(స్వరాజ్ మజ్దా) కబళించింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు సీఐ రాజు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సూరగాయని యజ్ఞ నారాయణ (25) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. వాషింగ్ మిషన్ మెకానిక్గా పనిచేస్తూ పద్మారావునగర్ గంగపుత్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కెమెరామెన్గా పనిచేసే అతని బావమరిది కూరేటి సాయిపవన్ (32) గుంటూరు నుంచి అతన్ని కలిసేందుకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీలో ఉండే చీకటి సుబ్రమణ్యంతో కలిసి వీరు బిర్యానీ తినడానికి పల్సర్ బైక్పై ముషీరాబాద్కు వెళ్లారు. అక్కడ బిర్యానీ హోటల్ మూసివేసి ఉండడంతో ట్యాంక్బండ్పై ఉన్న హోటల్కు వెళదామని బయలుదేరారు. కవాడిగూడ హోటల్ మారియెట్ చౌరస్తా వద్దకు రాగానే..అదే సమయంలో లోయర్ ట్యాంక్బండ్ నుంచి వేగంగా వచి్చన మినీ బస్సు సిగ్నల్ను దాటేసి ముందువెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో యజ్ఞ నారాయణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సాయిపవన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్రమణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీబస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. సుబ్రమణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది .