-
సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్కు అలాట్ చేశారు. జవహర్నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్కు వచ్చారు. -
మాటలతో మూటలు
సాక్షి, హైదరాబాద్: శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ చేసిన రూ.200 కోట్ల స్కామ్లో టెస్కాబ్ మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్ మెటీరియల్ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్ సంస్థగా మార్చడంలో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా, దర్యాప్తు నిమిత్తం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్ అధికారులు వాణీబాలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వాణీబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ‘ప్రియాంక’ సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు... ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్ తిలక్రోడ్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు రూ.6 కోట్ల మేర క్రెడిట్ తీసుకోవడంతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్ చేస్తుండటంతో తమ నగదు ఎక్కడికీ పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులు ఇచ్చారు. వాణీబాల సలహాతోనే ఫైనాన్స్ సంస్థగా... తన భర్త, కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణీబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీ స్కామ్కు ప్లాన్ చేసింది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ను ఫైనాన్స్ సంస్థలా మార్చేలా చేసింది. తొలినాళ్లల్లో తన సహోద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్లు తీసుకుంది. వీరికి సాలీనా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. దీంతో వారికి వాణీబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణీబాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తమకున్న ఫైనాన్స్ కంపెనీ విషయం చెప్పి..బ్యాంక్లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీవిరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. బ్యాంకు సిబ్బందినీ వినియోగించుకుంది జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణీబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమీషన్ల ఆశ చూపి, వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్ సంస్థకు తరలి వెళ్లిపోతున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సీసీఎస్లో కేసు నమోదైన తర్వాత వాణీబాలను సస్పెండ్ చేసి, విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు, బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని తెలిసింది. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా, గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులు దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణీబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాలంటూ బ్రోచర్లు డిపాజిట్దారులకు ఇవ్వడానికి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఎస్పీ లోగోతో బ్రోచర్లు ముద్రించింది. వాటిలో తమకు ఎస్పీ గ్రాఫిక్ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక డిజిటల్స్, శ్రీ ప్రియాంక గ్రాఫిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్లోని తిలక్రోడ్తో పాటు జీడిమెట్ల, బెంగళూరులోని రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్ల్లో వీటి బ్రాంచ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మంగళవారం మరికొందరు బాధితులు సీసీఎస్కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితోపాటు సంబం«దీకులు, ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న సబ్రిజి్రస్టార్లకు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్పై జూలై మూడోవారంలో హియరింగ్ జరగనుంది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఉద్యోగ జీవితంలో సంపాదించింది మొత్తం పెట్టేశా మా బంధువు ఒకరు టెస్కాబ్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు దాదాపు రూ.60 లక్షల వరకు ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడి పెట్టారు. వారి ద్వారానే వాణీబాల నాకు పరిచయమైంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన నేను నా ఉద్యోగ జీవితంలో సంపాదించిన రూ.20 లక్షలు వారి వద్ద పెట్టుబడిగా పెట్టాను. సైదాబాద్ మనోహర్కాలనీలోని వాణీబాల ఇంటికి తాళం వేసి ఉండగా.. బ్యాంకు అధికారులు అక్కడే ఆమె సస్పెన్షన్ నోటీసు అంటించారు. సీసీఎస్ పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. – ఎం.శ్రీనివాసమూర్తి, ల్యాబ్ టెక్నీషియన్, కోటి గవర్నమెంట్ ఆస్పత్రి -
సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.ఈ మేరకు సీఐడీ ఇన్చార్జి అదనపు డీజీ మహేశ్భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు. -
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వానాకాలం నుంచి అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వరి ధాన్యానికి బోనస్ చెల్లింపు అంశంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాందీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా హామీ ఇచి్చన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం మోసానికి పరాకాష్టగా పేర్కొన్నారు. యాసంగిలో సాగు చేయని సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో 20 శాతం మాత్రమే సన్నరకం సాగు చేస్తారని, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు సాగు చేస్తారన్నారు. ‘భరోసా’రూ.5 వేలేనా? రాష్ట్రంలో దిగుబడి వచ్చే 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని హరీశ్రావు పేర్కొన్నారు. అయితే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇచ్చేందుకు రూ.500 కోట్లు సరిపోతాయని, దీనితో రూ.5,500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, గతంలో మాదిరిగా తొలి విడతలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయి పడిన రూ.2,500తో పాటు వానాకాలం సాయం రూ.7,500 కూడా కలుపుకుని జూన్ నెలాఖరులోగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు మీడియా సమావేశంలోనే మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్రెడ్డితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. -
ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్ ముగిసేలోగా తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ విధానం, ఎగుమతుల విధానం, నూతన లైఫ్సైన్సెస్, మెడికల్ టూరిజం, ఈవీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత, వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, చేనేత కారి్మకులకు ఉపయోగపడేలా విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. -
ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్నగర్లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కాగా అశోక్ నగర్లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జూన్ నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.‘ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడనిసమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది.ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండిఐటి ఎగుమతుల దాకారికార్డులు బద్దలయ్యినయి.మీ అందరి మద్దతుతోనీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపినం.వృద్ధులకు ఆసరా అయినం..ఆడబిడ్డలకు అండగా నిలిచినం.సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.గుండెల నిండా జై తెలంగాణనినాదం నింపుకున్నం.మన భాషకు పట్టం గట్టినం.మన బతుకమ్మ, మన బోనంసగర్వంగా తలకెత్తుకున్నం.గంగా జమునా తెహజీబ్ కుసాక్షీభూతంగా నిలిచినం.అవమానాలుఅవహేళనలుఎదుర్కొన్న గడ్డ మీదనేతెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్నిఅంబరమంత ఎత్తున ఎగరేసినం.కేసీఆర్ పాలన సాక్షిగాఇది తెలంగాణ దశాబ్ది!వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!.. జై తెలంగాణ ’ అని ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర… pic.twitter.com/i7WD2IwOC2— KTR (@KTRBRS) May 21, 2024 -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది.ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది. -
కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్షీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి -
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మంగళవారం(మే21) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయమై సీఎం వీరితో చర్చించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో త్వరలో జయజయహే పాట సరికొత్త బాణీతో అలరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ను అందెశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జయజయహే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
సెల్ఫోన్స్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరికి గురైన లేదా పొరపాటున పోగొట్టున్న సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్, లోకల్ ట్రాకింగ్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు పోలీసులు రోజుల్లో 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు.35,945 సెల్ఫోన్స్ రివకరీలతో కర్నాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 7387 సెల్ఫోన్స్ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఫోన్ దొంగతనం లేదా కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోర్టల్లో ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని పేర్కొన్నారు. -
‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తేమ పేరుతో క్వింటాల్కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎ వరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ (U) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
రైతులూ ఆందోళనొద్దు.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదని.. 500 బోనస్ సన్నబియ్యంతో మొదలు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని.. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు.‘‘మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.. రైతుల దగ్గర తడిచిన ధాన్యం కూడా కొంటున్నాం.. తరుగు లేకుండానే ధాన్యం కొంటున్నాం.. కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం.. తడిచినా, మొలకెత్తినా చివరి గింజ వరకు కొంటాం.. పదేళ్లలో ఏం చేయలేని వారికి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’‘ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, గత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు.మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి బోనస్ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. -
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడంతోపాటు, వేసవి తీవ్రత నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ అధికమైందని, దీని వల్లే చికెన్ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాణా ధర కేజీ 70 రూపాయలు పలుకుతుండటంతో కోళ్ల ఉత్పత్తిపై అనాసక్తి చూపుతున్నారు. పెరిగిన చికెన్ ధరతో తమకు నష్టమే జరిగిందని, విక్రయాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని కొందరు మాంసాహార ప్రియులు మాత్రం కేజీ చికెన్కు బదులు అర కేజీతో సర్దుకుంటున్నారు.మటనా.. వొద్దుద్దులే..!మాంసాహార ప్రియులకు మటన్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 700 రూపాయలు పలికిన మటన్ ధర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుండటంతో కొనుగోలుదారులకే కాదు వ్యాపారులకు సైతం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయటంతో మేకపోతులు, పొట్టేళ్లను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టాలని మాంసాహార ప్రియులు కోరుకుంటున్నారు. -
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్’ఖాతాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్ఫోన్ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. ఓ తెలుగు చానల్ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్ను జత చేస్తూ ‘బీఆర్ఎస్ యూఎస్ఏ’ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్తో డీప్ఫేక్ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో హరీశ్రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా నిలదీశారు మాజీమంత్రి హరీశ్రావు.‘‘ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.. వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు‘‘ అని హరీశ్రావు ట్వీట్ చేశారు.‘‘ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని హరీశ్రావు అన్నారు. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
జైలులో ఖైదీ మృతి...పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ఐపీసీ 302 కింద నేరం రుజువు కావడంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన కె.వెంకయ్యకు ట్రయల్కోర్టు జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో ఉంటున్న వెంకయ్యపై 2012, జూలై 4న మరో ఖైదీ డి.నర్సింహులు కత్తెరతో దాడి చేశాడు. గాయపడిన వెంకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అదే రోజు మృతి చెందాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ భార్య జయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరినా.. అందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో విధిలేక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, రూ.10 లక్షలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది పల్లె శ్రీహరినాథ్ వాదనలు వినిపిస్తూ జైలు అధికారుల బాధ్యతారాహిత్యమే వెంకయ్య మృతికి కారణమన్నారు. జైలు అధికారులు నిబంధన మేరకే వ్యవహరించారని, ఇందులో వారి నిర్లక్ష్యం ఏమీ లేదని హోంశాఖ తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మృతిచెందే నాటికి 55 ఏళ్ల వెంకయ్య నెలకు రూ.7,200 సంపాదిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. లెక్కగట్టి రూ.6,33,600 అవుతుందని పేర్కొన్నారు. ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.7.2 లక్షల అవుతుందని లెక్కించారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు 2018లో రూ.లక్ష చెల్లించినందున మిగిలిన రూ.6.2 లక్షల అందజేయాలని ఆదేశించారు. -
దేశంలో నంబర్వన్ ఐఎస్బీ
రాయదుర్గం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరోసారి దేశంలోని బిజినెస్ స్కూళ్లలో టాప్లో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్–2024ను సోమవారం విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్లో వరుసగా మూడవ ఏడాదీ హైదరాబాద్ ఐఎస్బీ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆసియా స్థాయిలో నంబర్–2గా గుర్తింపు పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. భవిష్యత్తు ఉపయోగం విషయంలో ఐఎస్బీ నంబర్ వన్ స్థానం పొందింది. బోధనా పద్ధతులు, మెటీరియల్స్ విషయంలో 25, డబ్బుకు తగిన విలువలో 15, తయారీ రంగంలో 27, ప్రోగ్రామ్ డిజైన్లో 28వ స్థానం పొందింది. గత ఏడాది 29..ఈ ఏడాది 26 అంతర్జాతీయ స్థాయిలో చూస్తే (గ్లోబల్ ర్యాంకింగ్స్) ఈ ఏడాది ఐఎస్బీ 26వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ర్యాంకు మెరుగుపర్చుకోవడం విశేషం. 2023లో ఐఎస్బీ 29వ స్థానంలో నిలిచింది. కాగా దేశంలో ఐఎస్బీ మూడేళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలువడంపై విద్యాసంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెరి్నంగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రొఫెసర్ దీపామణి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తు నాయకులను అందజేసే అంతర్జాతీయ స్థాయి నిర్వహణ సంస్థగా ఐఎస్బీ భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సంస్థ డీన్ పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. -
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్రావు వార్రూమ్గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్ను ప్రభాకర్రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్లోని టీఎస్సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. -
టీజీ 09 9999 రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబరుకు రూ. 25 లక్షల ధర పలికింది. ఖైరతా బాద్ ఆర్టీఏలో సోమవారం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూ షన్స్ ‘టయోటా లాండ్ క్రూజర్ ఎల్ఎక్స్’ వాహనం కోసం ఈ నంబరును దక్కించుకుంది. దీనిపై ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజు తో పాటు, బిడ్డింగ్ మొత్తం రూ.25,50,000 చెల్లించి సొంతం చేసుకుంది. ఆల్నైన్స్ కోసం ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇది మొదటిసారి అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. ప్రత్యేక నంబర్లకు ఖైరతాబాద్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఒక్క రోజే రూ.43,70,284 లభించినట్టు ఆయన చెప్పారు. ఆల్నైన్స్ ఆన్లైన్ అత్యధిక బిడ్డింగ్ ఇలా..👉 టీఎస్ 09 జీడీ 9999’ నంబరుకు ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.15,53,000👉 టీఎస్ 09 జీఈ 9999 నంబరుకు కీస్టోన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.17,35,000👉 టీఎస్09 జీసీ 9999 నంబరుకు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీస్ చెల్లించిన బిడ్డింగ్ మొత్తం రూ.21,60,000 👉 తాజాగా ‘టీజీ 09 9999’ నంబర్కు సోని ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ చెల్లించిన మొత్తం రూ.25,50,000 -
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
రామగిరి(నల్లగొండ): అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం నూకలవారిగూడేనికి చెందిన గుండెబోయిన నాగరాజుకు 2001లో గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన జ్యోతి(40)తో వివాహం అయ్యింది. వ్యవసాయం చేస్తున్న నాగరాజు మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఆదివారం మధ్యాహ్నం గేదెలను తోలుకొని జ్యోతి ఊరి చివరకు వెళ్లింది. అనుమానంతో భార్యను వెంబడించిన నాగరాజు గొడవకు దిగి కోపంతో జ్యోతి తలపై విచక్షణారహితంగా మోదాడు. దీంతో స్పృహ తప్పిన జ్యోతిని ఇంటికి తీసుకొచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిందని చుట్టుపక్కల వారికి చెప్పి అంబులెన్స్లో నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. జ్యోతి తలపై గాయాలను చూసిన ఆమె తండ్రి భైరవోని స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం పోస్టుమార్టం చేసి జ్యోతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పులకించిన తుంగా తీరం
24న పాలెంలో విత్తన మేళా
నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతి..
పేకాట స్థావరంపై దాడులు
టెర్రర్ హైవేస్!
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
భక్తిభావంతో మెలగాలి
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
గిరిజన గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్
తప్పక చదవండి
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- మాటలతో మూటలు
- అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
- ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
Advertisement