Top Stories
ప్రధాన వార్తలు
ఏపీ జడ్జిమెంట్ డే.. కూటమిలో గుబులు
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్లైజర్తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ సాక్షిలో..
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఆ వెంటనే కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా. మరోవైపు లిక్కర్ స్కాం సీబీఐ కేసులో కవిత కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నాం విచారణ జరగనుంది.
AP Election Update: కౌంటింగ్కు కొనసాగుతున్న కౌంట్డౌన్
AP Elections Counting Count Down11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్ఎగ్జిట్పోల్స్ సర్వేలన్నీ వైఎస్సార్సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్ఆర్సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్ బ్యాలెట్ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్తో పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్కు కౌంట్డౌన్ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కౌంటింగ్కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్ ఫోకస్ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్కుమార్ మీనా ప్రెస్మీట్నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్కుమార్ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా కామెంట్స్..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్ల ఎగ్జిట్ పోల్స్దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్సభ సీట్లు వైఎస్సార్సీపీవేనన్న టైమ్స్నౌ–ఈటీజీ రీసెర్చ్50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్సభ సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 పోల్స్ వైఎస్సార్సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్ల ఎగ్జిట్ పోల్స్లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్పోల్స్తాజా ఎగ్జిట్పోల్స్లో కనీసం వైఎస్సార్సీపీ గుర్తును కూడా ఫ్యాన్కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్దీప్ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్పోల్స్రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్
ప్రపంచకప్లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్గా
టీ20 వరల్డ్కప్-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్రౌండర్ డేవిడ్ వీస్ కీలక పాత్ర పోషించాడు.టీ20 క్రికెట్ చరిత్రలో..ఇక ఈ మ్యాచ్లో నమీబియా పేసర్ ట్రంపెల్మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్ బ్యాటర్లకు ట్రంపెల్మన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆది నుంచే ఒమన్ బ్యాటర్లకు ఈ నమీబియన్ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్మన్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.ఈ క్రమంలో ట్రంపెల్మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్మన్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఓవర్ వేసిన ట్రంపెల్మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్ను ఔట్ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్కి గురై ఆల్కహాల్కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!)
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
ఆ హీరోతో పని చేయనన్న హీరోయిన్.. ఇప్పుడు అతడితోనే హిట్..
హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో రూహి ఒకటి. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ సమయంలో 'రాజ్కుమార్తో పని చేయాలంటే చిరాకుగా ఉంది. ప్రతిసారి ఆయనతో కలిసి ఎలా నటించగలను? కాకపోతే ఆయన చాలా టాలెంట్.. నటిగా తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. తనతో కలిసి పని చేయడం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న ఫీలింగ్ వస్తుంది' అని చెప్పింది.మరోసారి జోడీఅతడితో పని చేయడమే చిరాకు అన్న జాన్వీ కపూర్.. మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో మరోసారి రాజ్కుమార్ రావుతో జోడీ కట్టింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆమె ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా కపిల్ శర్మ.. జాన్వీని ఊహించని ప్రశ్న అడిగాడు. రాజ్కుమార్తో మళ్లీ పని చేయనన్నావ్? అని ఇరకాటంలో పడేశాడు.అందుకే అలా చెప్పాఅందుకు జాన్వీ తెలివిగా సమాధానమిచ్చింది. మీడియా ఎప్పుడూ సెన్సేషనల్ హెడ్లైన్స్ కోసమే ఎదురుచూస్తుంది. నేను అలాంటి స్టేట్మెంట్ ఇస్తే సినిమా ప్రమోషన్కు ఉపయోగపడుతుందనుకున్నాను. అలాగే తనతో పని చేయడం ఎందుకు కష్టమో కూడా చెప్పాను. తనకు చాలా అనుభవం ఉంది, టాలెంటెడ్.. అలాంటి వ్యక్తి పక్కన నటించడం కష్టమే కదా..! అని బదులిచ్చింది.చదవండి: ప్రముఖ నటుడి బ్యాగ్లో 40 బుల్లెట్లు
Telangana: కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది.
తన కిడ్నీని అమ్మాలనుకుని, చివరకు..
హైదరాబాద్: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్ మూలాలు నగరంలో బయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రతాపన్(41) విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠా ఏర్పడిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో రియల్టర్ అయిన రాంప్రసాద్.. తన కిడ్నీని అమ్మాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఉన్న అనారోగ్యంతో అది వీలుకాలేదు. ఈలోపు ఇరాన్లో కిడ్నీ రాకెట్ నడిపించే మధుతో రాంప్రసాద్కు పరిచయం ఏర్పడింది. అప్పటికే మరో నిందితుడు సబిత్ కూడా తన కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ రాకెట్ ద్వారా మధు సంపాదన తెలిసి వీళ్లకూ ఆశపుట్టింది. అలా.. మధు ద్వారా రాంప్రసాద్, సబిత్.. ఇంకొందరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాంప్రసాద్ ఈ గ్యాంగ్కు లీడర్గా వ్యవహరించాడు. ఇరాన్తో పాటు కువైట్, శ్రీలంక కేంద్రాలుగా ఈ గ్యాంగ్ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యప్తులో వెల్లడైంది. ఇక.. ఈ ముఠా దాదాపు 40 మందికిపైగా యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు వెల్లడైంది. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని.. యువకులకు గాలం వేసేది ఈ గ్యాంగ్. ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో ఫేక్ పాస్పోర్టులు తయారు చేసి ఇరాన్కు తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్మెంట్లలో ఉంచేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించేవాళ్లు. కిడ్నీ దాతలను గుర్తించేందుకు హైదరాబాద్, విజయవాడలలో తనకు పలువురు సహకరించారని, అందులో వైద్య రంగానికి చెందిన వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు, ఇందుకోసం వారికి కొంత కమీషన్ కూడా ముట్టజెప్పానని రాంప్రసాద్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఇక.. ఈ కేసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. కిడ్నీ మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపు నిర్ధారణ దగ్గర నుంచి అనేక పరీక్షలు నిర్వహించి, ఫలానా దాత కిడ్నీ ఫలానా గ్రహీతకు సరిపోతుందని నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రాంప్రసాద్ పంపిన వారందరి కిడ్నీలు ఇరాన్లో ఎదురుచూస్తున్న వారందరికీ సరిగ్గా సరిపోయాయి. గ్రహీతల వైద్య పరీక్షల వివరాలను రాంప్రసాద్ ముందుగానే తెప్పించుకునేవాడని, కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధమైనవారికి ఇక్కడున్న ల్యాబొరేటరీల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎవరిది ఎవరికి సరిపోతుందో ముందుగానే నిర్ధారణకు వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. రాంప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిన్ని అరెస్టులు ఈ కేసులో జరిగేలా తప్పడం లేదు. ఈ కేసులో అంతకు ముందే త్రిస్సూర్కు చెందిన సబిత్ నాజర్, కళామస్సేరికి చెందిన సాజిత్ శ్యామ్రాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సబిత్ను విచారణ చేపట్టాకే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగింది. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్కు సంబంధించి భారత్లోని ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్ట్ కావాల్సింది ఇరాన్లో రాకెట్ నడిపించిన మధు మాత్రమే.
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది.
తప్పక చదవండి
- ఎగ్జిట్ పోల్స్పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
- సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
- అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
- వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
- సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
- పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అప్పుడు తాగి ఉన్నా..!’
- పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
- నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
- తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
సినిమా
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్స్టార్లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ధనుష్తో కియారా రొమాన్స్
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడు ధనుష్. ఈయన నటుడు మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, కథకుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఈయన తమిళంలో రాయల్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కథానాయకుడుగా ధనుష్ 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా తెలుగులో కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నటుడు నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తుండగా, రష్మికమందన్న నాయకిగా నటిస్తున్నారు. కాగా ధనుష్ ఇంతకుముందు రంజనా, షమితాబ్, అత్రాంగి రే వంటి హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసింది. తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్ సరసన నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది. 'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి నా షూటింగ్ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
డేట్ ఫిక్స్
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘యేవమ్’. ఈ చిత్రంలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశ్ దంతులూరి మాట్లాడుతూ– ‘‘మహిళా సాధికారతను చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
ఫొటోలు
కొండాపూర్లో రెస్టారెంట్ను ప్రారంభించిన సినీ నటి ‘హనీ రోజ్’ (ఫొటోలు)
ఫ్లోరల్ డిజైన్ దుస్తుల్లో ‘చందమామ’లా సత్యభామ (ఫోటోలు)
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. (ఫొటోలు)
రోజురోజుకి అందం పెంచుతున్న కృతి శెట్టి (ఫొటోలు)
హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ట్రెండింగ్ క్వీన్గా గుర్తింపు (ఫోటోలు)
క్రీడలు
విరాట్ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్ డుమ్మా!
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జూన్ 5న న్యూయర్క్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్ 3) తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు(జూన్ 4)న ఆటగాళ్లకు టీమ్ మెన్జ్మెంట్ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.కోహ్లి ప్రాక్టీస్ డుమ్మా!ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనలేదు. జూన్ 1న బంగ్లాదేశ్తో జరిగిన వార్మాప్ మ్యాచ్కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్ 2)న ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంటుడని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లి దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్ను టీ20 వరల్డ్కప్లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
టీ20 వరల్డ్కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఒమాన్పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.చెలరేగిన నమీబియా బౌలర్లు..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.వారెవ్వా మెహ్రాన్ ఖాన్..110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
వామ్మో.. ఇదేమి సిక్స్రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి
టీ20 వరల్డ్కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్ విజయం సాధించింది. అయితే పీఎన్జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్ తీవ్రంగా శ్రమించింది. 137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.పూరన్ భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో పూరన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్రైజర్స్ కెప్టెన్.. The man-in-form! 💥After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7— Star Sports (@StarSportsIndia) June 2, 2024
చెలరేగిన నమీబియా బౌలర్లు.. 109 పరుగులకే ఒమన్ ఆలౌట్
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి.
బిజినెస్
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్మార్క్ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్కు సిద్దమవుతున్న ఈ బైక్కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం.
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
బఫెట్ సంపద రహస్యం అదే
జెండరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమన్స్ సంపద విలువ 31.4 బిలియన్ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నెట్వర్త్ 139 బిలియన్ డాలర్లు. బఫెట్ కంటే సిమన్స్ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్ సిమన్స్ స్థాపించిన హెడ్జ్ ఫండ్ ‘రెనైసెన్స్ టెక్నాలజీస్’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. అదే వారెన్ బఫెట్ స్థాపించిన బెర్క్షేర్ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్ కంటే బఫెట్ సంపదే నాలుగు రెట్లు అధికం. ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్–బఫెట్ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. ఏటా 12 శాతం రాబడి సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది. 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్ వల్లే. ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు. కాంపౌండింగ్పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్ రాబడుతుంది. దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది. పెట్టుబడుల జర్నీ..బఫెట్ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్ డాలర్లు. నిజానికి బఫెట్ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ ‘ద సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్ 65 ఏళ్లకే రిటైర్ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్ పేర్కొన్నారు. బఫెట్ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు. సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్ స్కిల్ (నైపుణ్యం)గా హౌసెల్ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్ సంపద కాంపౌండ్ అయింది. జిమ్ సిమన్స్ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే. నిజానికి సిమన్స్ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్ మాదిరే సిమన్స్ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. బఫెట్ పంచ సూత్రాలు ⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. ⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. ⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది. ⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. ⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది. జిమ్ సిమన్స్ ఏమి చెప్పారంటే..?⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. ⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. ⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. ⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి. ⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ⇥ జేమ్స్ హారిస్ సిమన్స్ (జిమ్ సిమన్స్) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్ ఇన్వెస్టింగ్ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్ సోరోస్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు.
రిటైర్మెంట్ ఫండ్స్తో ఆర్థిక ప్రణాళిక ఇలా..
రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఆర్థిక అవసరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, ఆర్థిక భద్రతను సాధించేందుకు, స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడే మ్యూచువల్ ఫండ్ స్కీములు. సాధారణంగా వీటికి అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు (ఏది ముందైతే అది) లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇంతకీ పదవీ విరమణ తర్వాత రోజుల కోసం ముందునుంచే ఎందుకు ప్లానింగ్ చేసుకోవాలి అంటే.. రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా ప్రస్తుత జీవన విధానం విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకోక తప్పదు. మీ జీవితంలోని సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఆర్థికంగా నిశ్చింతగా ఉండే విధంగా ఈ ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రణాళిక అవసరాన్ని మరింతగా వివరించాలంటే, కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మెరుగుపడటంతో మనుషుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీనితో మన దగ్గరున్న ఆర్థిక వనరులు అంత కాలానికి సరిపోకపోవడమనే రిస్కులు ఉంటున్నాయి. అందుకే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ముందునుంచే ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక సామాజిక వ్యవస్థ స్వరూపం కూడా మారుతోంది. రిటైర్మెంట్ అవసరాల కోసం భవిష్యత్ తరాలపై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఇవే కాకుండా ఇక ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ, ఖర్చులూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా చూసినా.. సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత కూడా పాత జీవన విధానమే కొనసాగించాలంటే కష్టమైపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ మధ్య రిటైర్మెంట్ నిర్వచనమే మారిపోతోంది. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఒక కొత్త అడ్వెంచర్గా కూడా చూస్తున్నారు. బరువు బాధ్యతలు కొంత తగ్గి, కాస్త స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఇతరత్రా హాబీల వైపు మళ్లేందుకు కొంత అవకాశం లభిస్తుంది ఈ దశలో. మరి ఇలాంటి దశను ఆస్వాదించాలంటే తగినన్ని ఆర్థిక వనరులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్లానింగ్ ఇలా.. రిటైర్మెంట్ ప్లానింగ్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వీలైనంత త్వరగా మొదలుపెట్టడమనేది ముఖ్యం. దీనివల్ల మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత సమయం లభిస్తుంది. కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేందుకూ వీలుంటుంది. ఎన్నాళ్లకు ప్లానింగ్ చేసుకోవాలనేదీ చూసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి, 58 ఏళ్లకు రిటైర్ అయి, 80 ఏళ్ల వరకు జీవిస్తారనుకుంటే .. వారు 28 ఏళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత 22 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ ఖర్చుల లెక్క వేసుకోవాలి. ఇందుకోసం ధరల పెరుగుదల రేటునూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుత ఖర్చులు నెలకు రూ. 50,000గా ఉంటే, 5.3 శాతం ద్రవ్యోల్బం రేటు అంచనాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత నెలవారీ ఖర్చులు రూ. 1.4 లక్షల స్థాయిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ నిధికి రూపకల్పన చేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి అనేది మీరు పదవీ విరమణ చేసే నాటికి కూడబెట్టుకోవాల్సిన మొత్తం. ఇది మీ పదవీ విరమణ అనంతరం ఎదురయ్యే ఖర్చులన్నింటికీ కనీసం సరిపోయే విధంగా ఉండాలి. సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం 10–15 శాతం బఫర్ మొత్తాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. దీన్ని చూసుకుని, అంత నిధిని పోగేసేందుకు మీరు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనేది లెక్కించుకోవాలి. దీన్ని క్రమానుగతంగా, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం రిటైర్మెంట్ ప్లాన్లు అనువైనవిగా ఉండగలవు. ఫండ్స్ ప్రత్యేకతలు.. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఓపెన్ ఎండెడ్, రిటైర్మెంట్ సొల్యూషన్–ఆధారిత స్కీములుగా ఉంటాయి. వీటికి ముందుగానే చెప్పుకున్నట్లు అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సయిన 58 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ (ఏది ముందైతే అది) ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఇన్వెస్టర్లకు ఆర్థిక భరోసా కలి్పంచేందుకు, స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పర్చేందుకు ఉపయోగపడతాయి. ఇవి అటు ఈక్విటీలు (65 శాతం – 80 శాతం వరకు), అటు ఫిక్సిడ్ ఇన్కం సెక్యూరిటీస్లోనూ (35 శాతం నుంచి 20 శాతం వరకు) ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ప్రయోజనాలు అందిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్టర్లు ఆటో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ ద్వారా వీటి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక వీటిలో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయాలా లేక కొంచెం కొంచెంగానా అంటే.. సాధారణంగా పదవీ విరమణ అవసరాలకు సంబంధించి భారీ మొత్తాన్నే కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఫండ్స్లో క్రమానుగతంగా సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్–అప్ సిప్ విధానాన్ని ఎంచుకుని వీలైనంతగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లొచ్చు. రిటైర్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్ అవసరాలపై స్పష్టత, ఫోకస్ వస్తుంది. అయిదేళ్ల లాకిన్ వ్యవధి కారణంగా పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు తమ లక్ష్యానికి కట్టుబడి ఉండేలా మరింత క్రమశిక్షణను నేర్పుతుంది. అంతేగాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వారు పొందేందుకు తోడ్పడుతుంది.
వీడియోలు
తెలంగాణలో ఇక వానలే వానలు..
ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
భారీ భద్రతతో కౌంటింగ్ పై నిఘా
తెలంగాణలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..
వాగులో కొట్టుకుపోయిన కారు
రెడ్ రోజ్ బేకరిలో అగ్ని ప్రమాదం
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
ఫ్యామిలీ
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్కి గురై ఆల్కహాల్కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!)
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. అతనికి 93, ఆమెకు 67!
ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త, ప్రముఖ పెట్టుబడాదారుడు మీడియా దిగ్గజం రూపెర్ట్ ముర్డోక్ 93 ఏళ్ల వయసులో ఐదోసారి వివాహం చేసుకున్నారు. శనివారం ఎలెనా జుకోవా (67)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరి పెళ్లివార్త హాట్ టాపిక్గా నిలిచింది. ఇంతకీ ముర్డోక్ పెళ్లాడింది ఎవరిని? తెలుసుకుందాం ఈ కథనంలో..!న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మర్దోక్ లాస్ ఏంజెల్స్లోని బెల్ ఎయిర్లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్లో తన కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. గత సంవత్సరం ఫాక్స్, న్యూస్ కార్పొరేషన్ బోర్డుల నుండి పదవీ విరమణ చేసిన మీడియా మొగల్, లాస్ ఏంజిల్స్లోని బెల్ ఎయిర్లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్లో ఇరువురూ జంటగా మారారు. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి విదితమే.ఎమీలియా విక్స్టెడ్ రూపొందించిన అద్భుతమైన వైట్ గౌనులో మెరిసిపోగా, మర్డోక్ స్నీకర్స్ బ్లేక్ సూట్లో కనిపించారు. వీరి పెళ్లికి విచ్చసిన ప్రముఖ అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ తదితరులు ఉన్నారు.ఎలెనా జుకోవా ఎవరు?మాస్కో మేధావి వర్గం కుటుంబానికి చెందిన ఎలెనా జుకోవా ఒక రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మధుమేహం పరిశోధనలో ఆమె ప్రత్యేకతను సాధించారు. ఈ రంగంలో లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె విశేష కృషి చేశారు. 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చారు. రష్యన్ రాజకీయవేత్త, బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్తో వివాహం, మూడేళ్ల తర్వాత వీరు విడిపోయారు. వీరికి దశా జుకోవా అనే కుమార్తె ఉంది. ఇన్నాళ్లకు జుకోవాకు మార్చిలో ముర్డోక్తో నిశ్చితార్థం జరిగింది.వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్, ది డైలీ టెలిగ్రాఫ్తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్లెట్లకు యజమాని. 2022 నాటికి అమెరికాలోని 31వ ధనవంతుడు. అలాగే ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూపర్ట్ మర్దోక్ నికర విలువ 21.7 బిలియన్ డాలర్లు.ఇక మర్దోక్కు మొదట పాట్రీషియా బుకర్తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్డీ డెండ్, జెర్రీ హాల్లనూ పరిణయమాడి పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు.నాల్గవ భార్య, సూపర్ మోడల్ జెర్రీ హాల్కి 2022లో విడాకులు ఇచ్చాడు. అతగాడికి వెండి డెంగ్, అన్నా ముర్డోక్ మాన్ , ప్యాట్రిసియా బుకర్ అనే మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం పదవీ విరమణ అనంతరం, తన కుమారుడు లాచ్లాన్కు న్యూస్ కార్ప్లో తన ప్రధాన పాత్ర నుండి పగ్గాలను అప్పగించాడు. నలుగురు ద పిల్లలు వాటాలతో కుటుంబ ట్రస్ట్ ద్వారా కంపెనీ నిర్వహణ సాగుతోంది.
Medi Tips: గ్యాస్ సమస్యా? తగ్గించుకోండిలా!
కడుపులో గ్యాస్తో పొట్ట ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్లేవరకు ఓ సమస్యే. ఎంతో ఇబ్బందిగానూ ఉండవచ్చు, మరి ఈ గ్యాస్ సమస్య తగ్గాలంటే పాటించాల్సిన సూచనలివి...– తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. అది కూడా బాగా నమలి తినడం. – గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమలడం. – కొవ్వు ఎక్కువగా ఉండేవీ, డీప్ ఫ్రైలు, వేపుళ్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. – కాఫీ, టీ పరిమితంగా తీసుకోవడం. – సోడాలు, కార్బొనేటెడ్ అండ్ కూల్డ్రింక్స్కు దూరంగా ఉండటం.– సరిపడనివారు ΄ాలూ, ΄ాల ఉత్పాదనలకు దూరంగా ఉండటం. – ΄÷గ, ఆల్కహాల్ అలవాట్లు పూర్తిగా మానేయడం. – రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. – బరువు పెరగకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడంఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
విద్యార్థినులపై కామాంధుని వల
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్డ్రైవ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి సంఘటన బయటపడింది. వ్యాపారవేత్త శ్రేయస్ నాయక్ (25) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని కుందాపుర తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రేయస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయటంతో పరారయ్యారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిపి అశ్లీల వీడియోలను తీసి తన ల్యాప్లాప్లో ఉంచుకున్నట్లు బయట పడింది.ఎక్కువగా కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన్నట్లు అరోపణలు వస్తున్నాయి. వీడియోలు తీసుకున్న నిందితుడు వాటిని చూపి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. అంతలోనే దుండగుడు పరారయ్యాడు. శ్రేయస్ అరెస్ట్కు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.కె.అరుణ్ ఆదివారం తెలిపారు. నర్సుపై వైద్యుని అకృత్యం ఉడుపి జిల్లాలో మరో ఘటనలో.. కుందాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రాబర్ట్ రెబల్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు కుందాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాబర్ట్ రెబల్ను సస్పెండ్ చేశారు. గర్భం దాల్చిన చిన్నారిదొడ్డబళ్లాపురం: అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చిన కేసులో ముగ్గురిని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పోలీసులు అరెస్టు చేసారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి మహమ్మద్ ఇక్బాల్ (26), ఫారూక్ (19), మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. నిందితులు కొన్ని నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిపారు. బాలిక ఇప్పుడు ఆరునెలల గర్భంతో ఉండడంతో దారుణం వెలుగు చూసింది.
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
యాక్షన్ కుబేర
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
నాకేమీ తెలియదు, మొబైల్ పోయింది
బనశంకరి: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టైన హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయకుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు. మీ పని మీరు చేయండి, నేనేమీ చెప్పను అని మొండికేసినట్లు తెలిసింది. ప్రశ్నలను తమ న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తన మొబైల్ఫోన్ ఏడాది కిందట చోరీ అయ్యిందని, మీరు అడుగుతున్న మొబైల్ఫోన్ తన వద్ద లేదని సిట్ అధికారులకు చెప్పారు. అశ్లీల వీడియోలలో ఉన్నది మీరే కదా అని చూపించగా, ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదని, వారందరూ తనకు పరిచయం అంతే, నేను ఎవరిపై అత్యాచారానికి పాల్పడలేదని ప్రజ్వల్ చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణను ఎలా సాగించాలని సిట్ అధికారులు తలపట్టుకున్నారు. నేడో రేపో ఘటనాస్థలికి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విచారించి భోజనం అందజేశారు. శనివారం కూడా విచారణ కొనసాగించారు. ఆదివారం లేదా సోమవారం హాసన్, హొళెనరసిపురలోని ఇళ్లకు ప్రజ్వల్ను తీసుకెళ్లి సంఘటనలు ఎలా జరిగాయో మహజరు పరిచే అవకాశముంది. ముందస్తు బెయిలు కోసం తల్లి అర్జీ ప్రజ్వల్ కేసులో ఓ బాధిత మహిళను అపహరించారనే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తల్లి భవానీ రేవణ్ణ శనివారం హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని సిట్ గతంలో నోటీసులు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో పరారీలో ఉన్నారని భవానీ కోసం సిట్ గాలిస్తోంది. ముందస్తు బెయిల్కోసం భవానీ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా అర్జీని తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనే భయంతో భవానీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్ విచారణ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో భవాని నివాసానికి ముగ్గురు మహిళా న్యాయవాదులు వెళ్లారు. వారు ఆమె తరఫున సిట్ అధికారులతో చర్చించారు. విచారణకు హాజరవుతారని, అరెస్టు కోసం ఒత్తిడి చేయరాదని సిట్ను కోరారు.