-
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు -
హెచ్సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి విజయం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్రెడ్డి, మణికొండ విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్పై రవీందర్రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్ రావు, జిల్లెల సంజీవ్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్కుమార్, ట్రెజరర్గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ విజయం సాధించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్రెడ్డి బార్ అండ్ బెంచ్ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో 43 టైగర్ రిజర్వ్లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్లోని భరత్పూర్ రిజర్వ్ఫారెస్ట్లో వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో చేరి, నా కెరీర్ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
పేదల పక్షాన నిలవండి
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు. నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు ► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం. ► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం. ► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది. తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ -
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్ ఆన్లైన్లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దరఖాస్తు చేసుకోదలిచినవారు https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
కాంగ్రెస్లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
చంద్రబాబు, లోకేశ్ లకు ఎందుకు మద్ధతు ఇవ్వాలి: న్యాయవాది
-
సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రిలో కేసు
-
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
కస్టడీలోకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి
-
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
29 కోర్టు హాళ్లలో లైవ్ ప్రసార సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్లైన్ లైవ్ ప్రసారాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టులోని 29 హాళ్లలో విచారణల లైవ్ ప్రసార సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి లైవ్ ప్రసారాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే మొదటి కోర్టు హాల్లో లైవ్ ప్రసార సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సేవలు న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మిగతా కోర్టుల్లో జరిగే విచారణలను కూడా వీక్షించే వీలు కలగనుంది. దీనితో న్యాయవాదులకు కూడా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం లభిస్తుంది. భవిష్యత్లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని కోర్టులను ఆన్లైన్ లైవ్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్లైన్ లైవ్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్ ప్రసారాలతో పెండింగ్ కేసులు తగ్గే అవకాశం ఉందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లైవ్ ప్రసారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ సుధీర్కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్రావు, జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
సుప్రీంకోర్టు స్టే పై లాయర్ల సంబరాలు
-
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement