-
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
-
ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
-
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది. 1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైమ్లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
-
చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?
-
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
-
నాగబాబు నీతులు..!
-
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
-
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్.. కూటమిలో లేదు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్గా సాగితే వైఎస్సార్సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్గా మారితే వైఎస్సార్సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉందిప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది. -
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్ జరపాల్సిందే: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు. మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.‘‘దమ్మాలపాడు బూత్లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఏపీలో భారీగా పోలింగ్.. ఎంత శాతం అంటే?
-
వైఎస్ఆర్సీపీ గెలుపు ధీమా
-
పోలింగ్ వద్ద విధ్వంసం.. జేసీ కుటుంబంపై కేసు
-
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ పూర్తి
-
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పండుగ
-
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement