-
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
రాడిసన్ డ్రగ్స్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో విక్రయిస్తున్నారు. హైదరబాద్లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరబాద్తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్పేట్, చాదర్ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్ను పిటీ వారింట్పై హైదరాబాద్కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్ వెల్లడించారు. -
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిందితుల డ్రామాలు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అధునాతన డ్రగ్స్ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ శాంపిల్స్ టెస్టు.. యూరిన్ టెస్ట్.. రెండింటిలోనూ నెగెటివ్ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్ శాంపిల్స్ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే.. అలా ఎలా?.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో.. నీల్ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్లో పాజిటివ్గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హెయిర్శాంపిల్స్లోనూ నెగెటివ్ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్ శాంపిల్స్ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్ వచ్చినా కన్జూమర్స్ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. -
గజ్జల వివేకానంద గుట్టు విప్పుతున్న పోలీసులు
-
అన్నపూర్ణమ్మకు కౌంటర్.. సింగర్ చిన్మయికి షాక్..!
సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ.. చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
రోజుకో మలుపు..భారీ ట్విస్ట్
-
Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. అయితే కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్ హోటల్లో గజ్జల వివేకానంద్కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అబ్బాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు. రెండురోజుల్లో క్రిష్ను విచారిస్తాం క్రిష్ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు. డ్రగ్కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్ హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్కు అందించాడన్నారు. వివేకానంద్ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. పరారీలో శ్వేత, సందీప్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్ పార్టీలకు రెగ్యులర్గా ఎవరు వస్తున్నారు, డ్రగ్ సప్లయ్ చైన్ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్ హోటల్ మేనేజర్ డ్రగ్తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్ అరెస్టుతో రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. -
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో డ్రగ్స్తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు పోలీసులు. కాగా, ఓ బీజేపీ నేత కుమారుడు నిన్న రాత్రి కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో విందులో కొకైన్ తీసుకున్నట్టు గుర్తించారు. ఇక, హోటల్లో కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ముగ్గురు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఉన్నారు. -
హైదరాబాద్ లో గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరొకరి పట్టివేత
-
గచ్చిబౌలిలో ది సాగా బిగ్గెస్ట్ కార్నివాల్ పోస్టర్ లాంచ్(ఫొటోలు)
-
హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టివేత
-
ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక, తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడుతున్నది. తాజాగా మరో ఐదు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పట్టుబడిన నగదు ఏకంగా రూ.650 కోట్లకు పైగానే చేరుకున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్బంగా గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు. ఇది కూడా చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. సన్నిహితులపై ఆక్రోశం!
ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. పదనాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న అనుభవం. మరో పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహారం. అన్నీ ఉండీ కూడా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తే ఏ ఒక్క వర్గం నుంచీ కూడా ఎందుకు స్పందన లభించలేదు? చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే తప్పు చేశారు కాబట్టే జైలుకు పంపారని అంటున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. బాబు కుటుంబ సభ్యులు మినహా ఏ ఒక్కరూ కూడా అరెస్ట్ అన్యాయం అన్న మాటే అనడం లేదు. ప్రజల నుండి స్పందన ఉందని అనిపించుకోవడం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గచ్చిబౌలిలో సంగీత కచేరి తరహా కార్యక్రమం నిర్వహించారే తప్ప ప్రజలు తమంతటగా తాము బాబును విడదల చేయాలని కూడా కోరలేదు. ఇదే చంద్రబాబును తీవ్రంగా కలచి వేసిందట. రూ.371 కోట్ల లూటీ కేసులో చంద్రబాబును సెప్టెంబరు తొమ్మిదో తేదీన అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నా అయ్యో పాపం అన్న వారే లేకుండా పోయారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ చంద్రబాబుకు అన్యాయం జరిగిందని భావించడం లేదు. ఆయన దోపిడీకి సంబంధించి.. దర్యాప్తు సంస్థల వద్ద సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపిందని వారు నమ్ముతున్నారు. ఒక్క నారా, నందమూరి కుటుంబాలు .. సినీరంగంలోని ఓ నలుగురు టీడీపీ కార్యకర్తలు, బాబు కేబినెట్లో పదవులు అనుభవించిన వారు తప్ప ఎవ్వరూ కూడా బాబును అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంతా అంటున్నారు. ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు అండ్ కో ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయారో చెప్పాలని వారంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే మా నాయకుణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఏ వర్గమూ అనలేదు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. ఏ ఒక్క వర్గమూ అండగా నిలబడటంలేదని కుత కుతలాడిపోతూనే.. గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగుల పేరిట ఓ మ్యూజికల్ కాంసెర్ట్ తరహా షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు సామాజిక వర్గ పెద్దలే కోట్లు ఖర్చు పెట్టి వివిధ రంగాలకు చెందిన వారిని ఐటీ ఉద్యోగుల ముసుగులో గచ్చిబౌలి స్టేడియానికి తరలించారు. చంద్రబాబు వల్ల లబ్ధిపొందాం కాబట్టే ఆయనకు మద్దతుగా స్టేడియానికి వచ్చి షో చేశామని ఐటీ ఉద్యోగులమని చెప్పుకుంటున్న వారు అన్నారు. లాజిక్ మిస్.. ఒక వేళ అదే నిజం అనుకున్నా ఇక్కడే టీడీపీ నేతలు చంద్రబాబు తరఫున హడావిడి చేస్తోన్న కొద్దిమంది ఓ లాజిక్ మిస్ అయిపోతున్నారు. 14ఏళ్ల చంద్రబాబు పాలనలో లబ్ధి పొందింది కేవలం కొద్ది మంది ఉద్యోగులే అని వారికి వారే చెప్పుకుంటున్నారు. ఆయన గురించి రైతులు కానీ.. విద్యార్ధులుకానీ.. కార్మికులుకానీ.. మహిళలు కానీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు కానీ ఎందుకు గచ్చిబౌలి తరహా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఎక్కడా ఆందోళనలు చేపట్టలేదు. కనీసం నినాదాలు కూడా చేసింది లేదు. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై జైలు నుండి విడుదలైనప్పుడు తనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పుకున్నారు. అయితే, అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మాత్రం సన్నిహితులతో మాట్లాడుతూ చంద్రబాబు చాలా నిర్వేదంగా మాట్లాడినట్లు సమాచారం. ఇదేంటి? ఏ ఒక్క వర్గానికీ మనం అక్కర్లేదన్నమాట.. మనల్ని అరెస్ట్ చేస్తే ఎవరికీ ఏమీ కాదన్నమాట అని తన వాళ్లతో చెప్పుకుని బాధపడ్డారని తెలుస్తోంది. గచ్చిబౌలి కార్యక్రమం అయినా మనంతట మనం చొరవ తీసుకుని డబ్బులు ఖర్చు పెడితేనే అయ్యిందని సన్నిహితులు చెప్పడంతో చంద్రబాబు మొహం వివర్ణం అయిపోయిందని భోగట్టా. ప్రజలంతా ఒక విధంగా తనని బాయ్ కాట్ చేసేశారని చంద్రబాబు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మనం వారిని పట్టించుకోలేదు.. ఇపుడు వారు మనల్ని పట్టించుకోవడం లేదని ఓ సీనియర్ నేత అనడంతో చంద్రబాబు ఏం మాట్లాడలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారట. నాలుగు వారాల్లో కంటి ఆపరేషన్ చేయించుకుని మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో జనాన్ని ఆకర్షించడానికి ఇక మార్గమే లేదా అని ఆయన మదనపడుతున్నట్లు చెబుతున్నారు. -కుర్చీ కింద కృష్ణయ్య. -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
గచ్చిబౌలిలో మహిళపై హత్యాచారం.. గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడకుడు, ఒక కూతురు ఉన్నారు. బాధితురాలు వేస్ట్ మెటీరియల్ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అవ్వగా.. నేడు ఆలస్యంగా మహిళ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ ఆవేదన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని నానక్రామ్గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు. చదవండి: ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్కు చెందిన నితీశ్ నానక్రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్స్టేషన్కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్ను పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
-
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై స్పోర్ట్స్ బైక్ ప్రమాదం.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. మితి మీరిన వేగంతో బైక్పై వెళ్తూ అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టి ఫ్లై ఓవర్పై నుంచి పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఫ్లైఓవర్పైనున్న డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయారు. కాగా, మెదక్ జిల్లా కకునూరుపల్లికి చెందిన బండి మధు(26), సూర్యాపేట జిల్లాకు చెందిన మచ్చగిరి (24) గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ టెక్నీషియన్లుగా పనిచేస్తూ మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీరు బైకుపై ఆస్పత్రికి బయలుదేరారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై షాగౌస్ సమీపంలో ఫ్లై వర్పై కుడి వైపు రెయిలింగ్కు ఢీ కొట్టడంతో ఫ్లై ఓవర్ నుంచి కింద పడ్డారు. కాగా, తీవ్ర గాయాలతో మధు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో గిరి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. టిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అటు వైపు వెళ్లారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది కూడా చదవండి: టమాటా దొంగలు అరెస్ట్ -
HYD: పోలీసు స్టేషన్లో కస్టోడియల్ డెత్!.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్స్టేషన్లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహార్కు చెందిన నితీశ్(32), బిట్టు, వికాస్లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు -
Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్రెడ్డి -
నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్నాయక్ సోమవారం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు. –గచ్చిబౌలి -
రాష్ట్రపతి రాక.. హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: నగరానికి రేపు(మంగళవారం, జులై 4) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంను సందర్శించనున్నారామె. ఈ నేపథ్యంలో రేపు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్కప్ జట్టులో ఫినిషర్కు చోటు!
కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
తప్పక చదవండి
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement