-
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
నైన్ ఆల్ ఫైన్
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. -
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
ఐదురోజుల పాట.. రికార్డు సాధించింది ఇలా..!
వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్ సదర్భంగా ఆమె తన గాన మారథాన్ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్ను బ్రేక్ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్ సునీల్ వాగ్మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు. What’s your experience with Chocolate 🍫? Plus your location. #afuaasantewaasingathon #ChocolateLovers #ghanachocolate #fypageシ pic.twitter.com/PeGDSInxwq — AFUA ASANTEWAA SINGATHON 🇬🇭 (@efiadahemaa) January 26, 2024 -
ఐదురోజుల పాట..గిన్నిస్ వరల్డ్ రికార్డు
వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్ సదర్భంగా ఆమె తన గాన మారథాన్ ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్ను బ్రేక్ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్ సునీల్ వాగ్మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు. -
ముక్కుతో 'ఈల' పాట విన్నారా?
ఈల పాటలు వినే ఉంటారు. కానీ ఇలాంటి ఈల పాట విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే? ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండి ఉండరు కూడా. వింటే ఇలా కూడా ఈల వేస్తారా అని ఆశ్చర్యోవడం ఖాయం.! ఈలపాట పాడటం అంత ఈజీ కాదు. చాలామంది హుషారుగా ఉన్నప్పుడు ఏదో కొద్ది క్షణాల సేపు ఈలతో కూనిరాగాలు తీస్తుంటారు గాని, పూర్తిపాటను శ్రుతిలయలు తప్పకుండా పాడలేరు. అలా పాడగలిగే వారు చాలా అరుదు. అందుకే ఈలపాట కచేరీలు చేసేవారిని అంతా అబ్బురంగా చూస్తారు. ఆరితేరిన ఈలపాట గాయకులు సైతం నోటితో ఈలవేసే బాపతే గాని, వారెవరూ ముక్కుతో ప్రయత్నించలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ యువతి మాత్రం ఇంచక్కా ముక్కుతో ఈలపాటలను ఇట్టే పాడేస్తోంది. ఈమె పేరు లులు లోటస్. కెనడాలోని ఒంటారీయోకు చెందిన ఈమె ముక్కు దగ్గర మైకుపెట్టుకుని పాడుతుంటే జనాలు ఉర్రూతలూగుతారు. ముక్కు ద్వారా 44.1 డెసిబల్స్ ధ్వనితో ఈలపాటలు పాడగలగడమే ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ఈమెను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
కొత్త ఏడాదిలో ప్రపంచ రికార్డు : అదేంటో తెలుసా..!
ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు (SuryaNamaskar)చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి వైనం విశేషంగా నిలిచింది. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గుజరాత్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఏకంగా నాలుగు వేల మంది సామూహిక సూర్య నమస్కారాల్ని ఆచరించారు. 108 ప్రాంతాల్లో, 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఫీట్కు సంబంధించిన వీడియోను, ఫోటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించడం గర్వంగా ఉందని గుజరాత్ హోం మంత్రి సంఘవి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ప్రపంచ రికార్డ్ అని గిన్నిస్ ప్రతినిధి తెలిపారు. సూర్య నమస్కారం చేసే అత్యధిక మంది రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ ధృవీకరించారు. ఇంతకుముందు ఎవరూ ఈ రికార్డ్ను బద్దలు కొట్టడానికి ప్రయత్నించ లేదు కాబట్టి ఇది కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అన్నారు. 2024లో గుజరాత్ ఈ ఘనత సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా మన సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలోని మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన ఈ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ హాజరైనారు. పలువురు విద్యార్థులు, వృద్ధులు, యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. Gujarat welcomed 2024 with a remarkable feat - setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP — Narendra Modi (@narendramodi) January 1, 2024 -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్స్టర్స్కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్ను అందించారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ‘కూచిపూడి డ్యాన్స్ లెసన్’
గచ్చిబౌలి (హైదరాబాద్): తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నిస్ వరల్డ్ రికా ర్డ్స్లోకి ఎక్కింది. ఏకకాలంలో 3,783 మంది కళా కారులు కూచిపూడి నృత్యంచేసి కళా వైభవాన్ని ప్ర పంచానికి చాటారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వ ర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచి పూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు. స్టేడియం నలు మూలలా ఏడు నిమిషాలపాటు కళాకారులు నృత్యంచేస్తూ అలరించారు. గురువు పసుమర్తి శేషు బాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. గిన్ని స్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రిషినాథ్ నిర్వాహ కులకు సర్టిఫికెట్ను అందజేశారు. 2020లో త్యాగ రాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఏక కాలంలో 1,183 మంది కళాకారులు కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారని రిషినాథ్ తెలిపారు. కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవస రం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పాఠశాల స్థాయి లోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆ యన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని, ఈ నృత్యరూపకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలిత, వ్యవస్థాపక అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు. -
ఎంత పెద్ద జుట్టో..! గిన్నీస్ రికార్డ్ కైవసం
లక్నో: కురులు ఆడవారికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే పొడవాటి కేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే యూపీలో ఓ మహిళ ఏకంగా 7 పీట్ల 9 ఇంచుల పొడవైన జుట్టును కలిగి ఉంది. ఇంతటి భారీ కేశాలతో ఏకంగా గిన్నీస్ రికార్డ్ను సాధించింది. స్మితా శ్రీవాస్తవ(46) ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళ. ఆమె తన 14వ ఏట నుంచి జుట్టును కత్తిరించలేదు. అప్పటి నుంచి ఆమె జుట్టు క్రమంగా పెరగసాగింది. ప్రస్తుతం ఆమె జుట్టు 7 పీట్ల 9 ఇంచుల పొడవు ఉంది. ఇంతటి స్థాయిలో కేశాలను కలిగి ఉండటంతో ప్రపంచ రికార్డ్ను కైవసం చేసుకుంది. "భారతీయ సంస్కృతిలో దేవతలకు చాలా పొడవాటి జుట్టు ఉంటుంది. మన సమాజంలో జుట్టు కత్తిరించడం అశుభం అని భావిస్తారు. అందుకే మహిళలు జుట్టును పెంచుకునేవారు. పొడవాటి జుట్టు మహిళల అందాన్ని పెంచుతుంది." అని స్మిత వివరించారు. ఈ జుట్టుకు తాను ప్రతి వారం రెండు సార్లు శుభ్రం చేస్తానని స్మిత చెప్పారు. జుట్టును శుభ్రం చేసిన ప్రతిసారి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. తన పొడవాటి జుట్టును చూసి చాలా మంది సెల్ఫీ తీసుకుంటారని చెబుతోంది. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్కు సర్టిఫికెట్ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్స్కిల్స్లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్లైన్లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం
-
గిన్నీస్ రికార్డు సాధించిన తెలుగుతేజం నిహాల్!
న్యూజెర్సీ: అక్టోబర్ 7, 2023 అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధికంగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా బ్యాటరీలను ఇంతవరకు ఎవరు లైనింగ్ చేయలేదు.. కానీ మన తెలుగు విద్యార్థి నిహాల్ తన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యుల సహకారంతో ఈ ఘనతను నిహాల్ సొంతం చేసుకున్నారు. నిహాల్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం యావత్ తెలుగువారికి గర్వకారణం.. ఇది ప్రపంచంలో పర్యావరణ మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని గిన్నీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్లో రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సాధించిన విజయాలను అధికారికంగా నమోదు చేసి నిహాల్కు గిన్నీస్ రికార్డు ధ్రువ పత్రాన్ని అందించారు. రీసైకిల్ మై బ్యాటరీ సాధించిన ఈ విజయం తన పిలుపు స్పందించిన విద్యార్ధుల సహకారంతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నిహాల్ తెలిపాడు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి 10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది. 2019లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
Video: ప్లేయింగ్ కార్డ్స్తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..
కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చంటారు. కష్టపడేతత్వం ఉంటే ఎంతటి లక్ష్యాలను అయినా సాధించగలం. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు 15 ఏళ్ల బాలుడు నిదర్శనంగా నిలిచాడు. తన అసాధారణ ప్రతిభతో ఏకంగా వరల్డ్ రికార్డునే కొల్లగొట్టాడు. కోల్కతాకు చెందిన అర్నవ్ దగ అనే 15 ఏళ్ల బాలుడు ప్లేయింగ్ కార్డ్స్ను ఉపయోగించి భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్ను ఉపయోగించి.. కోల్కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్ కేథడ్రల్లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఎలాంటి టేపు, గమ్ సాయం లేకుండా ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం. దీని పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలతో ప్రాజెక్టును నిర్మించాడు. దీంతో అర్నవ్ రూపొందిన ఈ కట్టడం గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం’గా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తమ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది. బ్రయాన్బెర్గ్ మూడో హోటళ్లను 34 అడుగుల 1 అంగుళం పొడవుతో, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో నిర్మించాడు . తన ప్రాజెక్ట్ గురించి అర్నవ్ మాట్లాడుతూ.. ప్లేయింగ్ కార్డ్స్తో నిర్మాణాన్ని చేపట్టేందుముందు నాలుగు ప్రఖ్యాతి ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపాడు. వాటి నిర్మాణం, పని, ఆర్కిటెక్చర్ అన్నీంటిని అధ్యయం చేసినట్లు చెప్పాడు.‘ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్ కార్డ్స్తో చిన్న చిన్న మేడలు కట్టడం మొదలుపెట్టానని తెలిపాడు. లాక్డౌన్ సమయంలో దీనిపై మరింత కసరత్తు చేశా. దీంతో మూడేళ్లు శ్రమించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాధింనని అర్నవ్ తెలిపాడు. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్బోర్డ్పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
దోసిత్తనంపై అద్భుతం
కళ్యాణదుర్గం: బియ్యపు గింజలు... సుద్దముక్కలు.... సబ్బు బిళ్లలు... పెన్సిళ్లు... కాదేదీ కళకు అనర్హం అన్నట్టు తన సూక్ష్మ కళతో ఆర్టీసీ కండక్టర్ వివేకానంద అద్భుత చిత్రాలు ఆవిష్కరిస్తున్నారు. అక్షరాలను సూక్ష్మంగా రాస్తూ మైక్రో ఆర్టిస్ట్గా అవతారమెత్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్సలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. దోస కాయ విత్తనాలతో పాటు బియ్యం గింజలపై 189 తెలుగు అక్షరాలు, వందేమాతర గీతం, వేమన పద్యాలు రాసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. దోసకాయ విత్తనాలపై గాంధీ, మూత్ర పిండాల వ్యవస్థ, తాజ్మహల్, ఏసు శిలువ, పడవ, గుడిసె తదితర బొమ్మలను చిత్రీకరించారు. బియ్యపు గింజపై సెలవుచీటి రాసి అందరినీ అబ్బురపరిచారు. సుద్దముక్కపై సైన్స్కు సంబంధించిన అనేక అంశాలతో పాటు జంతువుల బొమ్మలూ వేశారు. అగ్గిపుల్ల, నారుపోగులపై ఏ నుంచి జడ్ వరకూ ఆంగ్ల అక్షరాలు లిఖించి ఆకట్టుకున్నారు. అలాగే పురాతన నాణేల సేకరణపై సైతం మక్కువ పెంచుకున్న ఆయన ఇప్పటి వరకూ భారతదేశంతో పాటు బెల్జీయం, జర్మనీ, ఆప్ఘనిస్తాన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలకు చెందిన సుమారు 300కు పైగా నాణేలు సేకరించారు. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకునేలా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎం.వివేకానంద కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నారు. 1995లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సూక్ష్మ కళతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్సలో చోటు దక్కించుకోవచ్చునని తెలుసుకున్న వివేకానంద తాను కూడా మైక్రో ఆర్టిస్ట్గా రాణించాలని భావించారు. అప్పటి నుంచి తన సాధనను మొదలు పెట్టిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పోస్టుకార్డుపై 2,058 ఇంగ్లిష్ అక్షరాలతో ‘జై సమైక్యాంధ్ర’ అనే నినాదాన్ని ఏపీ చిత్ర పటం ఆకారంలో లిఖించారు. అగ్గిపుల్లలపై జై సమైక్యాంధ్ర నినాదాన్ని 76 అక్షరాలతో, బియ్యపు గింజపై 14 అక్షరాలతో రాశారు. ప్రస్తుతం ఆయన అగ్గిపెట్టెలో పట్టేంత చిన్నపాటి పుస్తకంలో భగవద్గీత రాస్తున్నారు. ఇప్పటి వరకూ 9 పర్వాలు పూర్తయ్యాయి. కాగా, 2 సెం.మీ. వెడల్పు, 3 సెం.మీ. పొడవు పరిమాణంలో ఉన్న పుస్తకంలో మాత్రమే భగవద్గీత రాసినట్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఉంది. ఈ రికార్డును అధిగమించేలా 1.8 సెం.మీ. వెడల్పు, 2.8 సెం.మీ. పొడవు (అగ్నిపెట్టె) పరిమాణంలో ఆయన భగవద్గీత రాస్తూ గత రికార్డును బద్ధలుగొట్టే దిశగా ప్రయత్నిస్తూనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్కు చేరువయ్యారు. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంటా మనసుంటే మార్గం ఉంటుంది అనే నమ్మకంతో ముందుకు పోతున్నా. ఇప్పటి వరకూ దోస విత్తనాలు, బియ్యపు గింజలపై ప్రముఖుల చిత్రాలతో పాటు సైన్స్కు సంబంధించిన అంశాలను చిత్రీకరించాను. ప్రస్తుతం అగ్గిపెట్టెలో పట్టేంత పరిమాణమున్న పుస్తకంలో భగవద్గీత రాస్తున్నా. ఎలాగైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్సలో చోటు దక్కించుకుంటా. – ఎం.వివేకానంద, ఆర్టీసీ కండక్టర్ -
కురులతో భారత కుర్రాడు.. గిన్నిస్ బుక్ ఎక్కేశాడు
లండన్: చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటుంటే.. అంతా అతన్ని ఏడిపించేవారట. అమ్మాయిలా.. ఆ జుట్టేంట్రా అని టీజ్ చేసేవారట. అది అతన్ని ఎంతో బాధించేదట. ఇంట్లో గోల చేసి మరీ ఆ జుట్టును తొలగించే ప్రయత్నమూ చేశాడట. కానీ, మత సంప్రదాయాలు(సిక్కు) పాటించే ఆ తల్లిదండ్రులు.. అతనికి సర్దిచెప్పారు. అలా 15 ఏళ్లపాటు అతను ఓర్పుగా పెంచుకున్న జుట్టు అతనిప్పుడు పాపులర్ని చేసింది. 15 ఏళ్ల సిదక్దీప్ సింగ్ చాహల్.. ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు ఉన్న టీనేజర్గా(కుర్రాడు) గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన సిదక్దీప్.. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జుట్టు తీసింది లేదట. అలా అదిప్పుడు 146 సెంటీమీటర్లు పెరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్లో చోటు దక్కేలా చేసింది. Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It's took him 15 years to grow the longest head of hair on a teenager. — #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023 పెరిగేకొద్దీ ఒకానొక టైంలో.. నాకు జుట్టు మీద ఇష్టం పెరిగింది. కానీ, దానిని మెయింటెన్ చేయడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తాను. కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తారు. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుందేమో!.రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు మా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నమ్మలేదు::: సిదక్దీప్ -
250 మంది మహిళలు, ఒకే ఆలోచన.. గిన్నిస్ బుక్లో చోటు
250 మంది మహిళలు ఆరు నెలల్లో 2,719 క్రొచెట్ పాంచోలు తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ΄పాంచోలను గిరిజన పిల్లలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా వీరందరూ ఒక తాటి మీదకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మహిళా మనోవికాసం పేరుతో క్రొచెట్ గ్రూప్ను ప్రారంభించిన మాధవి సూరిభట్ల, డెభ్బై ఏళ్ల వయసులోనూ చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ, టీమ్లీడర్గా ఫణి శిరీష, తనూజలు ఈ సందర్భంగా ఈ రికార్డు సాధనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త ప్రపంచం కుటుంబ జీవనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. 70 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంబ్రాయిడరీ, క్రొచెట్ అల్లిక చిన్నప్పటి నుంచీ అలవాటు. మహిళా గ్రూప్లో చేరి నాలుగేళ్లు అవుతోంది. వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, తెలియంది తెలుసుకోవడం చేస్తుంటాను. ఇంటి దగ్గర రోజూ కొంత సమయం ఎంబ్రాయిడరీకి కేటాయిస్తుంటాను. ఈ గ్రూప్ ద్వారా ఈవెంట్లో పాల్గొని చాలామంది మహిళలతో పరిచయాలు పెంచుకోగలిగాను. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా, చాలా ఆనందంగా అనిపించింది. – డి.వి.రాఘవమ్మ, విజయవాడ గ్రూప్కి లీడర్ని మా పిల్లలతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. మూడేళ్ల క్రితం మహిళా మనోవికాస్లో జాయిన్ అయ్యాను. 25 మంది ఉన్న గ్రూప్కి లీడర్గా ఉన్నాను. ఇలా మొత్తం తొమ్మిది టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీమ్లో 25 నుంచి 35 వరకు ఉంటారు. నెల రోజులు ఆన్లైన్లో క్రొచెట్ కోర్సు నేర్చుకున్నాను. కిందటేడాది గ్రూప్ అంతా దాదాపు 4,686 క్రొచెట్ టోపీలు అల్లి, ఈవెంట్ చేశాం. ఆ టోపీలను చలి ఎక్కువ ఉండే గిరిజన ప్రాంతాల పిల్లలకు అందజేశాం. ఈసారి పాంచోస్ను కూడా అదేవిధంగా పంపిణీ చేస్తున్నాం. రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – ఫణి శిరీష, హైదరాబాద్ ఆన్లైన్ క్లాసుల నుంచి మొదలు... ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం చేసే నేను పిల్లలు సెటిలయ్యాక మానేశాను. ఇంటి వద్ద ఉంటూ నా హాబీస్ పైన దృష్టి పెట్టాను. అన్నిరకాల హ్యాండ్క్రాఫ్ట్స్ చేయగలను. అందులో భాగంగానే నా క్రాఫ్ట్ వర్క్ నలుగురికీ తెలియజేద్దామని ఎఫ్బిలో మధురం క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. కొంతమంది తమకు క్లాసులు చెప్పమన్నారు. దీంతో కోవిడ్ టైమ్లో గ్రూప్ స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసులు చెబుతూ వచ్చాను. విదేశాలలోనూ నా స్టూడెంట్స్ ఉన్నారు. చెన్నై గ్రూప్తో 3 సార్లు క్రొచెట్ గిన్నిస్ రికార్డ్లో పాల్గొన్నాను. నా వ్యక్తిగతంగానే ఏడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వైజాగ్లోనూ ఈవెంట్ చేయాలనే ఆలోచనతో మహిళా మనోవికాస్ పేరుతో గ్రూప్ ప్రారంభించాను. ఆన్లైన్లో మహిళలకు క్రోచెట్ క్లాసులు తీసుకునేదాన్ని. ఒకరి ఆలోచనను ఇంకొకరు పంచుకుంటూ క్రొచెట్ అల్లికలు చేసి, వాటిని పేదవారికి పంచాలనేది ఆలోచన. దేశ విదేశాల నుంచి ఒకరి ద్వారా మరికొందరు పరిచయం అవుతూ ఆన్లైన్లో ఒక తాటిమీదకు వచ్చారు. కిందటేడాది క్రొచెట్ టోపీలు తయారుచేశాం. ఇప్పుడు పాంచోస్ తయారుచేశాం. పెళ్లి అయిన తర్వాత గృహిణులుగా ఉన్నవారు తమ జీవితంలో ఎలాంటి అచీవ్మెంట్ లేదు అనుకునేవారికి ఇదో మంచి బూస్టింగ్ అయ్యింది. మా గ్రూప్లో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. కీమో తీసుకుంటూ కూడా ఈ అల్లికలు చేశారు. ఈవెంట్కు అటెండ్ అవ్వాలనుకునేవారు 150 మెంబర్స్ వచ్చారు. ఆరేళ్ల పాప నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అందరికీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. – మాధవి సూరిభట్ల, విశాఖపట్నం మా పిల్లలకూ నేర్పిస్తున్నాను.. డెలీవరీ టైమ్లో ఖాళీగా ఉండటంతో ఆన్లైన్లో క్రోచెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆర్డర్స్ మీద అమీ గ్రూమీ స్టఫ్డ్ టాయ్స్ కూడా చేయడం నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పది పాంచోస్ చేస్తే చాలు అనుకున్నాను. నేను 25 పాంచోస్ చేసిచ్చాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా అచీవ్మెంట్ వస్తుంది అని. కొంతమంది ‘మాకు నేర్పిస్తారా, మేం ఎలా ఇందులో పాల్గొనాలి..’ అని అడుగుతున్నారు. ట్రైబల్ పిల్లలకు వాటిని అందజేశారు. – తనూజ, నంద్యాల -నిర్మలా రెడ్డి -
కూతురిపై ప్రేమ: గిన్సిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఏం చేశాడో తెలుసా?
Mark Owen Evans Record గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం కొంతమంది ఒక గోల్. ఎవరూ చేయడానికి సాహసించని పనులు , విన్యాసాలతో తమ పేరును ప్రత్యేకంగా నిలుపుకోవాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఓ 49 ఏళ్ల వ్యక్తి వ్యక్తి తన గారాల పట్టి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూఏకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని పంచ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఎవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురు పేరు 'లూసీ'పై 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్ చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్లు బంధం సాటిలేనిదని నిరూపించాడు. ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటపాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకుతెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి దక్కించు కోవడం, దీన్ని తన కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్గా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్బుక్లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
గిన్నిస్ భర్ సింగ్
పంజాబ్కు చెందిన అమృత్భర్సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్లను క్రియేట్ చేసిన అమృత్భర్సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్పై 86 పుషప్లు చేసి గిన్నిస్బుక్లోకి ఎక్కాడు. గుర్దాస్పూర్ జిల్లా ఉమర్వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు. మోడ్రన్ జిమ్లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్భర్ సింగ్. -
మొక్కవోని ధైర్యం.. గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్లోకి
అమెరికా మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్స్టాప్గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి. ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట. షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement